ప్రముఖ తెలుగు రచయిత్రి జగద్ధాత్రి ఆత్మహత్యవిశాఖపట్నం:

ప్రముఖ తెలుగు రచయిత్రి జగద్ధాత్రి ఆత్మహత్యవిశాఖపట్నం:

 ప్రముఖ తెలుగు రచయిత్రి జగద్ధాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె ఇంట్లో ఉరేసుకుని ఆగస్టు 24 శనివారం మరణించినట్లు తెలుస్తోంది. భర్త రామతీర్థ మరణం తర్వాత ఆమె మానసికంగా ఒంటరితనానికి గురైనట్లు చెబుతారు. రామతీర్థ కూడా సాహితీలోకానికి తన రచనల ద్వారా సుపరిచితులు

ఆమె మరణానికి కారణాలు తెలియరాలేదు. ఒంటరితనం కారణంగానే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆత్మహత్యకు ముందు ఆమె రెండు లేఖలు రాసినట్లు సమాచారం. తనకు సంబంధించిన వస్తువులను అన్నింటిని రాజేష్ అనే యువకుడిగకి  ఇవ్వాల్సిందిగా ఆమె ఓ లేఖలో రాసినట్లు చెబుతున్నారు. రాజేష్ ఆమెకు నిత్యజీవితంలో చేదోడువాదోడుగా ఉంటూ వస్తున్నాడు.

తన మరణానికి ఎవరూ బాధ్యులు కారని మరో లేఖలో ఆమె రాసినట్లు చెబుతున్నారు. ఈ రెండు లేఖలను కూడా స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆమె కవిత్వంతో పాటు విమర్శనా వ్యాసాలు కూడా రాశారు. అనువాదాలు కూడా చేశారు. కావ్య జ్యోతి పేరుతో ఆమె అనువాద కవితలతో ఓ ప్రముఖ దినపత్రికలో కాలమ్ నిర్వహించారు.

మొజాయిక్ లిటరరీ అసోసియేషన్ లో చురుకైన పాత్ర పోషించారు. వక్షస్థలే అనే కథకు ఆమె ఆర్ఎస్ కృష్ణమూర్తి అవార్డును అందుకున్నారు. ఆమె మృతికి తెలుగు సాహిత్య లోకం నివ్వెరపోయింది. సోషల్ మీడియాలో తెలుగు సాహిత్యకారులు తమ విచారాన్ని వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు.

గతంలో ఆమె లెక్చెరర్ గా పనిచేశారు. తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో ఆమె రచనలు చేస్తూ వచ్చారు. ఇటీవలే ఆమె వెంకోజీపాలెం నుంచి ఎంపివీ కాలనీకి తన నివాసాన్ని మార్చారు. తన చావుకు ఎవరూ కారణం కాదని ఆమె తన సూసైడ్ నోట్ లో పోలీసు కమిషనర్ ను ఉద్దేశించి రాశారు.(తెలుగు టీమ్ )

ఆంద్ర విశ్వ విద్యాలయం నుండి తెలుగు ఏం ఏ లో గోల్డ్ మెడల్ సాధించి ,,ఫిలాసఫీ సో షియాలజీ లలోనూ ఏం ఏ డిగ్రీలుపొంది,సైకాలజీలో ఏం ఎస్ సి ,,ఏం ఎడ్ ,అయి ఇంగ్లిష్ లో ఏం ఫిల్  చేసిన విదుషీమణి ,సాహితీ చైతన్య మూర్తి రామతీర్ధకు తో సాహితీ సహజీవనం జరిపిన సాహితీ జగత్  ధాత్రి  జగద్ధాత్రి  .ఆంధ్రప్రభ ఆంధ్రభూమి సూర్య ప్రజాశక్తి దినపత్రికలలో నవ్య వీక్లి చినుకు ,విశాఖ సంస్కృతీ మాసపత్రికలకు  విరివిగా ఆలోచనాత్మక విశ్లేషణాత్మక వ్యాసాలు రాసిన బహు ముఖీన సాహితీ దీప్తి ఆమె ఆంద్ర ,ఆంగ్ల హిందీ ఉర్దూ మొదలైనభాషలలో లోతైన పాండిత్యమున్న సాహితీ గేస్తురాలు  ,మ్యూజ్ ఇండియా ,,కౌముది ,విహంగ ఇ  -వాకిలి మాగజైన్లను తన రచనలతో సంపన్నం చేసిన భావుకురాలు .తెలుగు నుండి ఇంగ్లిష్ కు కవితలు వచనం అనువాదం చేసి ,జాతీయ ,అంతర్జాతీయ కవుల  కవితలను తెలుగులోకి అనువదించిన బహు భాషా వేత్త  కవయిత్రి ఆంధ్రభూమి సోమవారం  సాహిత్య పేజీలో ”కావ్య జగతి ”శిర్షికలో అనువాద కవితలు వెలువరించి అన్యభాషాకవులను తెలుగు వారికి పరిచయం చేసిన సౌజన్యమూర్తి
  విశాఖ ఆకాశవాణి ద్వారా వివిధ విషయాలపై విస్తృత ప్రసంగాలు చేస్తూ ,,తెలుగు విశ్వ విద్యాలయానికి ,,సాహిత్య అకాడెమి సెమినార్లకు పరిశోధక వ్యాసాలను రాసిన శేముషి ఆమెది .సహ సాహిత్యజీవి రామ తీర్ధ తోకలిసి మొజాయిక్ సాహిత్య సంస్థ ద్వారా శ్రీ శ్రీ శత  జయంతి ,కన్యాశుల్కం రెండవ ప్రచురణ,గురజాడ 150 జయంతి ,జనగణమన శతజయంతి  ,విజయనగరం కోట త్రిశత జయంతి కార్యక్రమాలు నిర్వహించి అనుక్షణ సాహితీ సేవకురాలు  .మొజాయిక్ తరఫున ప్రతివారం క్రమం తప్పక కార్యక్రమాలు నిర్వహించిన అవిరళ కృషి ఆమెది .ఆమె ప్రతిభకు తగినట్లు ”వృక్ష స్థలే ”అనే కథానికకు  ఆర్ ఎస్ కృష్ణ మూర్తి అవార్డు అందుకున్నది .ధాత్రి పేరుతో తన ప్రత్యేక బ్లాగ్ ను నిర్వహించి0ది ,పుడమితల్లికి ఉన్న ఓర్పు ,నేర్పు, సహనం ఆమెలో ఉండటం వలన ఆమెకు జగద్ధాత్రి పేరు సార్ధకమైంది .
  ఛామన ఛాయ శరీరం చెదరని ,చిఱునవ్వు ముఖాన వెడల్పు కుంకుమబొట్టు ,నిండైన చేనేత వస్త్రధారణతో శ్రీమతి జగద్ధాత్రి సాక్షాత్తు అమ్మవారు గా కనిపించేవారు .చాలా సభలలో కలుసుకొని ఆమెతో ,రామతీర్ధతో మాట్లాడిన విషయాలు మనసు పొరల్లో ఉండిపోయాయి  రామ తీర్ధ మరణించిన 3 నెలలకే జగద్ధాత్రి చనిపోవటం సాహితీ లోకానికి తీరని వెలితి ఆమె ఆత్మకు శాంతికలగాలని కోరుతున్నాను . దుర్గాప్రసాద్ -24-8-19-ఉయ్యూరు
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమయం - సందర్భం and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.