మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-71
71-‘’నరుడా ఏమి నీ కోరిక ‘’డైలాగ్ ఫేం,దశాబ్ది సినీ హాస్య మహారాణి –గిరిజ
గిరిజ సుప్రసిద్ధ తెలుగు సినీ నటి. నటుడు రేలంగితో జతగా అనేక చిత్రాలలో హాస్యం పండించింది.
గిరిజ తల్లి ప్రముఖ రంగస్థల, సినిమా నటి దాసరి రామతిలకం. 1936లో కంకిపాడులో పుట్టిన గిరిజ, గుడివాడలో పెద్దమ్మ వద్ద ఉంటూ చదువుకునేది. 13 ఏళ్ల వయసులో మద్రాసులో ఉంటున్న తల్లి వద్దకు వెళ్లింది. అందంగా ఉన్న ఆమె ఆ చిన్న వయసులోనే సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపింది. కస్తూరి శివరావుకు ఈమె ఫోటోలు చూపితే ఏకంగా పరమానందయ్య శిష్యుల కథలో రాజకుమారిగా అక్కినేని సరసన అవకాశం కల్పించారు. ఆ సినిమా అంతంత మాత్రంగానే నడిచినా, ఆ సినిమాతో రేలంగి పరిచయమయ్యాడు. ఆయన ప్రయత్నంతోనే పాతాళభైరవిలో అవకాశం వచ్చింది. ఆ తరువాత వరుసగా అవకాశాలు వచ్చాయి. గిరిజ 1950, 60వ దశకంలో హీరో, హీరోయిన్లతో సమానంగా గుర్తింపు పొందింది.
నేపధ్యము
1950 – 1960 దశకాల్లో ఏకచత్రాధిపత్యంగా సినీజగత్తును ఏలిన హాస్య మహారాణి గిరిజ. కస్తూరి శివరావు నిర్మించిన పరమానందయ్య శిష్యులు చిత్రంతో అక్కినేని నాగేశ్వరరావు సరసన కథానాయికగా సినీరంగ ప్రవేశం చేసింది. తర్వాత పాతాళభైరవి చిత్రంలోని ‘నరుడా ఏమి నీ కోరిక’ అనే ఒకే ఒక్క పలుకుతో కథానాయిక పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. సుప్రసిద్ద హాస్యనటుడు రేలంగితో జట్టుకట్టిన తర్వాత అప్పటి హీరోహీరోయిన్లకు సమానంగా కీర్తి సంపాదించింది. అన్నపూర్ణ, గుడిగంటలు, అప్పుచేసి పప్పుకూడు, జగదేకవీరుని కథ, ఆరాధన వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది.
ఒక పక్క హాస్యనటిగా నటిస్తూనే మరోపక్క అక్కినేని నాగేశ్వరరావు (వెలుగునీడలు), ఎన్. టి. రామారావు (మంచి మనసుకు మంచిరోజులు), జగ్గయ్య (అత్తా ఒకింటి కోడలే), శివాజీగణేశన్ (మనోహర), హరనాథ్ (మా ఇంటి మహాలక్ష్మి), చలం (కులదైవం), జె. వి. రమణమూర్తి (ఎం.ఎల్.ఏ) వంటి కథానాయకుల సరసన నాయికగా రాణించింది.
వివాహము, వ్యక్తిగత జీవితము[
గిరిజకు 17 యేళ్ళ వయసులో తల్లి మరణించింది. ఈమె వివాహము సి. సన్యాసిరాజు అనే సినీ దర్శకుడితో జరిగింది. వివాహం తర్వాత గిరిజ సన్యాసిరాజును నిర్మాతను చేయడానికి ప్రయత్నించింది. గిరిజ భర్త సన్యాసిరాజు, విజయగిరి ధ్వజా ప్రొడక్షన్స్ అనే చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించి 1969లో ఎన్టీఆర్, కాంచన, అంజలితో భలే మాస్టారు సినిమా తీశాడు. ఆ సినిమా అంతంత మాత్రంగానే నడిచింది. 1971లో ఎన్టీఆర్, చంద్రకళతో పవిత్ర హృదయాలు తీశారు. ఆ సినిమా కూడా విజయవంతం కాకపోవటంతో గిరిజ సంపాదించిన ఆస్తంతా కోల్పోయింది. మద్రాసు రెండంతస్థుల విశాలమైన భవనం అప్పులతో చేజారిపోయింది. రేలంగి మరణించిన తరువాత ఆమెకు సినిమాల్లో అవకాశాలే కరువయ్యాయి. సొంత ఇల్లు కోల్పోయి చివరకు చిన్న అద్దెగదిలోకి మారే పరిస్థితి ఏర్పడింది. పూట గడవని స్థితికి వచ్చింది. రాజశ్రీ, ‘భీష్మ‘ సుజాత వంటి సహనటీమణుల ఆదరణతో ఎలాగో కొంతకాలం బతుకుబండిని నెట్టుకొచ్చి ఆ తర్వాత కాల ప్రవాహంలోకి జారిపోయింది.
ఈమె కూతురు శ్రీరంగ, దాసరి నారాయణరావు నిర్మించిన మేఘసందేశంలో అక్కినేని నాగేశ్వరరావు కుమార్తెగా నటించింది. ఆ తరువాత సలీమాగా అనేక మలయాళం సినిమాలలో నటించి మంచినటిగా పేరు తెచ్చుకున్నది.
నటించిన సినిమాలు
1. నవ్వితే నవరత్నాలు (1951)
2. పాతాళభైరవి (1951) (పాతాళభైరవి గా)
5. భలే అమ్మాయిలు (1957)
6. దొంగల్లో దొర (1957)
7. ముందడుగు (1958)
9. అప్పుచేసి పప్పుకూడు (1959)
11. రాజా మలయసింహ (1959)
12. రేచుక్క పగటిచుక్క (1959)
13. ఇల్లరికం (1959) (కనకదుర్గ గా)
15. పెళ్ళికానుక (1960)
16. భట్టి విక్రమార్క (1960)
17. సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి (1960)
18. బాగ్దాద్ గజదొంగ (1960)
21. ఇంటికి దీపం ఇల్లాలే (1961)
22. జగదేకవీరుని కథ (1961)
23. భార్యాభర్తలు (1961) (అక్కినేని మాజీ ప్రేయసిగా)
24. వెలుగునీడలు (1961)
25. సిరిసంపదలు (1962)
27. పరువు ప్రతిష్ఠ (1963)
30. కలవారి కోడలు (1964)
31. ప్రేమించి చూడు (1965)
32. మంగమ్మ శపథం (1965)
34. ఆస్తిపరులు (1966)
36. ఆడదాని అదృష్టం (1974)
మా అమ్మపై ఇన్ని పుకార్లా-గిరిజ కుమార్తె సలీమా
‘నరుడా ఏమి నీ కోరిక’ డైలాగ్ ఆమెదే. ‘సరదా సరదా సిగిరెట్టు ఇది దొరల్ తాగు బలె సిగిరెట్టు’ అని రేలంగి సరదా పడితే ‘కంపుకొట్టు ఈ సిగిరెట్టు కాల్చకోయి నా పై ఒట్టు’ అని కసురుకుంది ఆమే. ‘ఆరాధన’ సినిమాలో అక్కినేనిని, సావిత్రిని తీవ్ర ఇక్కట్లకు తోసింది ఆమె కపటత్వమే. ‘లవకుశ’లో రాముడి వేషం కట్టిన ఎన్టీఆర్కు సీతమ్మ వేషం కట్టిన అంజలీ పై మనసు విరిగిపోవడానికి కారణమైన రజకుని భార్య వేషం ఆమెదే. గిరిజ బ్లాక్ అండ్ వైట్ జమానాలో తెలుగు వారి కామెడీ స్టార్. రేలంగికి సరిజోడి. సెకండ్ హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్గా గిరిజ స్టార్డమ్ను చూసింది. ‘వెలుగు నీడలు’, ‘జగదేకవీరుని కథ’, ‘ఆత్మబంధువు’, ‘నమ్మినబంటు’, ‘కులగోత్రాలు’, ‘ప్రేమించి చూడు’, ‘భార్యాభర్తలు’… ఎన్నో సినిమాలు ఆమె నటనకు ఆనవాలుగా నిలిచి ఉన్నాయి.
వెండితెరపై ఒక వెలుగు వెలిగిన గిరిజ ఆ తర్వాత ఏమైందో ఎవరికీ వివరాలు తెలియదు. సోషల్ మీడియా వాడుకలోకి వచ్చాక గిరిజపై ఆధారాలు లేని కథనాలు ఎన్నో అప్లోడ్ అవుతున్నాయి. తెలుగువారికి ఎంతో ఇష్టమైన ఈ నటి గురించి వాస్తవాలు తెలుసుకోవడానికి ‘సాక్షి’ చేసిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇది. తెలుగువారికి దాదాపుగా తెలియని గిరిజ కుమార్తె, నటి సలీమా మొదటిసారిగా చెన్నై నుంచి ఇలా సాక్షి ద్వారా తెలుగు పాఠకులతో మాట్లాడారు. ఆ వివరాలు.
గిరిజ మరణించినట్టు పేపర్లలో వార్త వచ్చిందా?
సలీమా: నాకు గుర్తు లేదు. ఎవరూ రాసినట్టు లేదు. ఇండస్ట్రీవాళ్లు కూడా ఎవరూ వచ్చి చూడలేదు. అమ్మ చనిపోయిన రోజు అంతిమ సంస్కారాలు ముగిశాక – నాకు టైమ్ కూడా బాగా గుర్తు– రాత్రి 8.45కు శోభన్బాబు ఫోన్ చేశారు. నేను శోభన్బాబుని… అమ్మ చనిపోయినట్టు తెలిసింది… బాధపడకు… తెలుగు పరిశ్రమ ఎప్పుడూ నీకు తోడు ఉంటుంది.. ఏ కష్టం వచ్చినా రా అన్నారు. ఆయనొక్కరు. ఆ మరుసటి రోజు అల్లు రామలింగయ్య గారు వచ్చి వెళ్లారు. అంతే. మీ అమ్మ చాలా దీనావస్థలో మమరణించారని, నిరుపేద స్థితిలో మరణించారని ఇక్కడ వార్తలున్నాయి.
సలీమా: అది తెలుగు జర్నలిస్టుల ఊహాశక్తి అనుకుంటున్నాను. మా అమ్మ చనిపోయే సమయంలో టి.నగర్లోని మందిర అపార్ట్మెంట్స్లో మేం ఉన్నాం. అది నేను కొన్న నా సొంత ఫ్లాట్. ఆ అపార్ట్మెంట్స్లోనే దర్శకుడు కె.మురళీమోహనరావు, రాజ్ కోటీలలోని రాజ్, హీరోయిన్ రంజిత ఉండేవాళ్లు. మీరు వాళ్లను కూడా అడిగి కన్ఫర్మ్ చేసుకోవచ్చు.
మీ అమ్మమ్మ నటి తిలకం మీ అమ్మ మద్రాసు వచ్చిన మూడేళ్లకే మరణించడం వల్ల మీ అమ్మకు సరైన దిశానిర్దేశం లేకుండా పోయిందని ఇక్కడ ప్రచారం.
సలీమా: ఎవరు ఇవన్నీ రాస్తున్నది? మా అమ్మమ్మ తిలకం ఫిబ్రవరి 24, 1995న మరణించారు. ఆమె చనిపోయిన ఆర్నెల్లకు అమ్మ పోయింది. మా నాన్న మమ్మల్ని వదిలిపోయాక మా అమ్మమ్మ, అమ్మ, నేను ఒక గూటి పక్షులుగా పెరిగాం. మా అమ్మమ్మ లేకపోతే మా అమ్మ, నేను ఏమయ్యేవారమో చెప్పలేము. మా అమ్మమ్మకు చిన్న వయసులోనే పెళ్లవడం వల్ల అమ్మ, అమ్మమ్మ అక్కాచెల్లెళ్లలా ఉండేవారు. ఇద్దరూ ఒకే సమయంలో చనిపోయారు.
మీ నాన్న సన్యాసిరాజుగారి వివరాలు చెబుతారా?
సలీమా: నాకు ఆయన గురించి ఎటువంటి ఆసక్తి లేదండీ.
మీకు గుర్తున్నవి?
సలీమా: నాకు గుర్తున్నంత మటుకు ఆయన మా అమ్మను బాగా హింసించేవాడు. నేను చాలా చిన్నపిల్లను. కాని అంత చిన్నవయసులో కూడా మా అమ్మ సఫరింగ్ తెలిసేది. మా అమ్మకు ఆయనను ఎవరు పరిచయం చేశారో తెలియదు. కాని తిరుపతి వెళ్లి పెళ్లి చేసుకొని వచ్చారు. ఆయన ఖర్చు చేసిన ప్రతి రూపాయి మా అమ్మదే. ఆయనకు పెద్ద గ్యాంగ్ ఉండేది. మా అమ్మకు ఉన్న నీలిరంగు అంబాసిడర్ కారులో వాళ్లతో అర్ధరాత్రి వరకు తిరిగి, తాగి వచ్చేవాడు. మరుసటిరోజు కారు డ్రైవర్ వచ్చి ఆయన కారులో వాంతి చేసుకుంటున్నాడని గోల పెట్టేవాడు. ఒకసారి ఆయన ఏ వస్తువుతోటో మా అమ్మను తల మీద మోదితే పద్నాలుగు కుట్లు పడ్డాయి. నేనొకసారి పరిగెత్తుకుంటూ ‘డాడీ’ అని వెళితే కాలితో తన్నాడు. దొర్లి కింద పడ్డాను. ఆ తర్వాత ఆయన వైపు వెళ్లింది లేదు. ఆయన మంచి భర్త కాదు. మంచి తండ్రి కాదు. ‘నేను ఈ పెళ్లి చేసుకోకపోతే చాలా బాగుండేదాన్ని. వివాహంలో స్త్రీకి సరైన పురుషుడు దొరక్కపోతే ఆమె జీవితం సగం దెబ్బ తిన్నట్టే’ అని మా అమ్మ అనేది.
మీ నాన్న రెండు సినిమాలు తీశారు కదా.
సలీమా: అవును. రెంటిలోనూ ఎన్టీఆరే హీరో. ఒకటి ‘భలే మాస్టారు’. రెండు ‘పవిత్ర హృదయాలు’. అందులో ఒక్కరూపాయి కూడా నాన్నది లేదు. అన్నీ అమ్మవే. చాలా గ్యారంటీ సైన్లూ అవీ అమ్మే చేసింది. సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అప్పుల బాధ పెరిగింది. ఒకరోజు పొద్దున నాన్న ఇప్పుడే వస్తానని వెళ్లి మళ్లీ కనిపించలేదు. మా ముఖం ఎప్పటికీ చూడలేదు. అమ్మమ్మ, అమ్మ, నేను… స్ట్రగుల్ అయ్యాం వాస్తవమే కాని పత్రికలు సానుభూతి కథనాలు రాసే స్థాయి కాదు.
మీ పేరు సలీమా అని ఉండటం ఆసక్తి కలిగిస్తోంది. మీరు మతం మారారా?
సలీమా: లేదండీ. మా అమ్మ కలకత్తా కాళేశ్వరి దేవి భక్తురాలు. అక్కడకు వెళ్లి మొక్కుకుని వచ్చాక నేను పుట్టానని ఇంట్లో కాళమ్మ అని పిలిచేవారు. కాని ఆ తర్వాత అమ్మకు మౌంట్రోడ్లో ఉండే దర్గాపై గురి కుదిరింది. ఆ దర్గా ఇప్పటికీ ఉంది. రోడ్డు వైడెనింగ్లో ఆ దర్గాను తొలగించాలని ప్రయత్నించినవారు రక్తం కక్కుకు చచ్చారని కథనాలు ఉన్నాయి. అంత పవర్ఫుల్. ఆ దర్గావారు నాకు ఇచ్చిన పేరు సలీమా. నా అధికారిక పేరు, రికార్డ్స్లో ఉన్న పేరు సలీమాయే. కాని నాకు మత పట్టింపు లేదు. గుళ్లకు, చర్చిలకు, దర్గాలకు వెళతాను.
మీరు ఏం చదివారు?
సలీమా: ఇంటీరియర్ డెకరేషన్లో డిప్లమా చేశాను. కాని ఆ రంగంవైపు వెళ్లలేదు. అమ్మ ఇన్ఫ్లూయెన్స్ నా మీద ఉంది. చిన్నప్పుడే అమ్మ చీరలు కట్టడానికి ట్రై చేసేదాన్ని (నవ్వు). నాకు టీనేజ్ రాగానే మోడలింగ్వైపు అవకాశాలు వచ్చాయి. అప్పట్లో టెక్స్టైల్ యాడ్స్ ఫేమస్. సుమంగళి టెక్స్టైల్స్, మహరాణి టెక్స్టైల్స్.. ఇలా దాదాపు 150 యాడ్స్ చేశాను. అక్కినేని నాగేశ్వరరావు కోరితే ‘మేఘసందేశం’ క్లయిమాక్స్లో ఆయన కూతురిగా యాక్ట్ చేశాను. ఆ సమయంలోనే అనుకోకుండా ఒక మలయాళ సినిమా మేనేజర్ నన్ను చూసి మలయాళంలో యాక్ట్ చేస్తారా అన్నారు. సరే అన్నాను. అలా టి.చంద్రకుమార్ దర్శకత్వంలో ‘నిజన్ పిరన్నా నట్టిల్’ (1985)లో నటించాను. మోహన్లాల్ హీరో. అయితే దానివల్ల గుర్తింపు రాలేదు. నటి కాంచనమ్మ రికమండేషన్తో ప్రఖ్యాత దర్శకుడు హరిహరన్ దర్శకత్వంలో ‘నఖక్షతంగళ్’ (1986)లో నటించాను. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్. ఇప్పటికీ నన్ను ఆ సినిమా హీరోయిన్గా అక్కడ గుర్తిస్తారు.
మరి హీరోయిన్గా ఎందుకు కొనసాగలేకపోయారు?
సలీమా: మలయాళంలో నాలుగేళ్లలో 7 సినిమాలలో నటించాను. ‘సంసారం ఒక చదరంగం’ కన్నడ వర్షెన్లో కల్పన రోల్ నేనే వేశాను. కాని ఆ తర్వాత నేను చెన్నైలో రియల్ ఎస్టేట్ వైపు వెళ్లిపోయాను. లాంగ్ గ్యాప్ తర్వాత ఇప్పుడు మలయాళం, తమిళ సినిమాలలో యాక్ట్ చేస్తున్నాను. మొన్న అంజలీ నటించిన ‘లీసా’లో చాలా మంచి రోల్ చేశాను. తెలుగులో అది రిలీజైంది.
మీరు మలయాళంలో చేస్తున్నప్పుడు తెలుగు ఇండస్ట్రీ నుంచి అవకాశాలు రాలేదా?
సలీమా: తెలుగు పరిశ్రమతో మాకు పెద్దగా కాంటాక్ట్ లేకపోవడం వల్ల ఏమీ రాలేదు.
గిరిజగారికి ఫీల్డ్లో ఎవరు ఫ్రెండ్స్ ఉండేవారు?
సలీమా: సావిత్రిగారు మంచి ఫ్రెండ్. ఏ మాత్రం ఖాళీ ఉన్నా మా ఇంటికి వచ్చేవారు. ఆమెకు మా అమ్మమ్మ వంటలు ఇష్టం. నా తొలి బేబీ సైకిల్ ఆమే కొనిపెట్టారు. అమ్మమ్మ అప్పుడప్పుడు రేలంగి గారింటికి తీసుకువెళ్లేది. వాళ్ల భార్య శ్రీదేవమ్మ, కొడుకు బాబుగారు, కోడలు కుమారి గారు వీరు తెలుసు. అమ్మమ్మ చాలాసార్లు నాగేశ్వరరావు గారి గురించి చెప్పేది. సెట్లో కనపడితే మేకప్ కుర్చీలో కూర్చోబెట్టి ‘గుడివాడ తిలకమ్మ గుడిలోకి వచ్చింది’ అని పాడుతూ గిర్రున తిప్పేవారట. ఇద్దరిదీ ఒకే ప్రాంతం కావడంతో ఆయన చాలా అభిమానంగా ఉండేవారు. ఇక ఇండస్ట్రీ ఫంక్షన్స్ అంటే చిరంజీవి గారి పెళ్లికి అమ్మతో కలిసి వెళ్లిన జ్ఞాపకం ఉంది.
గిరిజగారు ఎప్పడైనా తన నట జీవిత విశేషాలు చెప్పేవారా?
సలీమా: పెద్దగా లేదు. ఆమె తన వివాహ రోజులను, సినిమా రోజులను మర్చిపోయి జీవించాలి అన్నట్టుగా ఆమెను నేను చూసుకున్నాను. కాని అప్పడప్పుడు ఆమె నటించిన పాట ‘కాశీకి పోయాను రామా హరే’ పాడి ఆట పట్టించేదాన్ని. నిజం చెప్పాలంటే ఆమె పాటల్లో నాకు నాగేశ్వరరావుతో కలిసి నటించిన ‘హాయి హాయిగా జాబిల్లి తొలి రేయి వెండి దారాలల్లి’ చాలా ఇష్టం.
సాక్షి: రేలంగి గారు గిరిజగారు చాలా సన్నిహితంగా ఉండేవారని… కాని గిరిజ గారు ఆయనతో అనుబంధం తిరస్కరించారనీ…
సలీమా: దాని గురించి నాకు తెలియదు. నా చిన్నప్పుడు అదంతా జరిగిందేమో తెలియదు.
: మీరు సింగిల్గా ఉండటానికి మీ తల్లిగారి విఫల వివాహ ప్రభావం కారణమా?
సలీమా: అలా ఏం లేదు. జీవితంలో మంచి అవకాశాలే వచ్చాయి కానీ పెళ్లి చేసుకోబుద్ధి కాలేదు. నేను మగ ద్వేషిని కాను. నాకు మంచి స్నేహితులు ఉన్నారు. ఇప్పటికైతే పెళ్లి చేసుకోలేదు. మునుముందు చేసుకుంటానేమో తెలియదు. నాకు డాన్స్ వచ్చు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. డ్రైవింగ్ చాలా ఇష్టం. జీవితం నాకు నచ్చినట్టుగా ఉంది.
తెలుగు ఇండస్ట్రీకి ఏమైనా చెప్పదలుచుకున్నారా?
సలీమా: నేను గిరిజమ్మ కూతురుని. మా అమ్మ ఎన్నో తెలుగు సినిమాలు చేసింది. తెలుగు ఇండస్ట్రీ మీద నాకు హక్కు ఉంది. మా అమ్మ అక్కినేనితో పని చేసింది. వారబ్బాయి నాగార్జున ఫీల్డ్లో ఉన్నారు. ఎన్.టి.ఆర్తో పని చేసింది. వారబ్బాయి బాలకృష్ణ ఉన్నారు. వీరందరూ నాకూ ఇక్కడ స్థానం కల్పించాలని కోరిక. మంచి అవకాశాలు వస్తే హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాలని ఉంది. నేను జీవితంలో చాలా రంగాల్లో పని చేశాను. కాని మేకప్ వేసుకొని కెమెరా ముందు నిలిచినప్పుడు పొందే ఆనందం మరెక్కడా పొందలేదు. ఒక నటి కూతురికి అనువంశికంగా వచ్చే సంపదా, ఆస్తి అదేనేమో.
∙ఖదీర్
రావి కొండలరావు మాటలలో –
రావీ కొందిలరావు కొందరు హీరోయిన్లుగా ప్రవేశించి, వోస్యనటులవుతారు. కొందరువాోస్యనటులుగా
వచ్చి హీరోయిన్లవుతారు. ‘ఇందులో తొలి మాట ప్రకారం చూస్తే ఒక గిరిజ కనిపిస్తుంది.
కస్తూరి శివరావు తానే నిర్మాతగా దర్శకుడిగా తీసిన ‘పరమానందయ్య శిష్కులు”
(1950)లో గిరిజని నాయికగా పరిచయం చేశాడు శివరావు. అందులో అక్కినేని
నాయక పాత్రధారి. గిరిజ తల్లి దాసరి తిలకం. నాటి
నాటకాల్లోనూ, సినిమాల్లోనూ నటించారామె. “
యస్.విరంగారావు ప్రవరుడిగా, తిలకం
, వరూథినిగా నటించిన “వరూధిని”
స తిలకం తొలిచిత్రం కావచ్చు.
1 అంతకు ముందు చిన్నచిన్న
వేషాలు వేసినట్టు తెలుస్తున్నా!
1946లో ‘వరూధిని’ విడుదలై దెబ్బతిన్నది ‘పరమానందయ్య శిష్యులు’లో గిరిజ అందంగానే కనిపించింది. బాగానే వశీ
వుందనిపించినా, అక్కినేని పక్కన నటించినా, చకచకా పాత్రలు రాలేదు.
ఒకటి రెండు సినిమాల్లో సాదా పాత్రలు ధరించిన తర్వాత, హాస్యనటుల
ప్రక్కన నటించి, ‘హాస్యనటి’గా మారిపోయింది. ఈ మార్చుకి కొన్నేళ్ళు
పట్టినా, తర్వాత ఆ హాస్య పాత్రలు ఆమెను స్థిరపరిచాయి. హాస్య
నటులందరి పక్కనా ఆమె నటించినా, రేలంగితో ఎక్కువగా నటించజంతో
అదో జంటగా నిలబడి పోయింది – ‘రేలంగిరిజంట’గా అప్పుచేసి
పప్పుకూడు, భార్యాభర్తలు, కులగోత్రాలు, రాముడు భీముడు,
జగదేకవీరునికథ, పెళ్లికానుక మొదలైన సినిమాలు గిరిజని చక్కని
హాస్యనటిగా గుర్తు చేస్తాయి.
1961లో ‘పెండ్లి పిలుపు’ షూటింగు. అందులో ఆమె రేలంగి పక్కనే.
పల్లెటూరి పాత్ర. ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడే పాత్ర, ఆరుద్రగారు
రచయిత. పూసపాటి కృష్ణంరాజు (క్రీశ) అప్పుడు సినిమాల్లో
వుండేవాడు. తక్కువ కథలు రాసినా మంచివి రాశాడు. రాసినవన్నీ ఉత్తరాంధ్ర భాషలోనే రాశాడు. అంచేత ఆరుద్రగారు అతన్ని ఆ కంపెనీలో
పెట్టి గిరిజ సంభాషణలు, సంబడం చూడమన్నారు. ఆ గిరిజ
బాత్రూమ్లోకి వెళ్లి, షవర్ తిప్పితే భళ్లున నీళ్ళొస్తాయి. “ఓలమ్మ వాన,
వాన పడిపోతంది” అని పరుగెత్తుతుంది. కృష్ణంరాజు వూరుకోలేదు. డైలాగు
సరిదిద్దడానికి (ప్రయత్నించాడు.
“ఓలమ్మవోన, వోనడిపోతంది” అని
చెప్పాలన్నాడు. అవి డబ్బింగ్లో
సర్దుకో వచ్చులే అన్నరోజులు కావు.
అక్కడికక్కడే రికార్డింగు. “వోనేంటి
వోన! వోనడిపోతంది – అంటే అర్ధం
కాదు. మరీ అంత యాసలోకి వెళితే,
అక్కడి వాళ్లకి అర్ధం కావచ్చునేమో
గాని, తక్కిన ప్రాంతాల వాళ్లకి
అసలు అర్లం కాదు. అంచేత వాన
అనీ, పడిపోతంది అనీ అంటాను”
అని గిరిజ వాదించారు. “ఆమె చెప్పింది కరక్టే – మరీ ఇంటీరియర్ భాష వొద్దులెండి ” అని నిర్మాత
డి.బి.నారాయణ గిరిజనే సమర్థించారు.
గిరిజ సంతోషించింది కాని కృష్ణంరాజు
సంతోషించలేదు. “భాషని ఖూనీ
చేస్తున్నారే” అని బాధ పడిపోయాడు.
షాట్ అయిపోయిన తర్వాత “అక్షరాల్లో
తేడా వున్నా, యాసలో తేడా రాదు.
యాస గనక సరిగ్గా వస్తే ఏ అక్షరం
పడినా ఇబ్బంది వుండదు” అని గిరిజ
అంది. కృష్ణంరాజు ఒప్పుకున్నాడు.
“మంచి స్టడీ వున్న ఆర్టిస్టు” అని
ఆరుద్రగారు సర్టిఫికేట్ ఇచ్చారు. గిరిజ
సంభాషణలు శుభ్రంగా వినిపిస్తాయి. ఏ అక్షరమూ పొల్టు పోదు. ఎక్స్ప్రెషన్
వుంటుంది. మంచి కళ్ళు గనుక, కళ్లు కూడా ఆమెతో పాటు నటించి,
సహకరించి, పకపకమనిపిస్తాయి.
అప్పటి నటీమణులకు మంచి సంప్రదాయాలు, అలవాట్లూ వుండేవి,
పండగా పబ్బం వస్తే ఇంటి నుంచి గారెలో, బూరెలో పెద్ద “హేత్రలలో
తెచ్చి, చిన్నా పెద్దా అందరికీ ఇచ్చేవారు. ఆ ఆప్యాయతాభిమానానురాగాల అలాంటివి. సూర్యకాంతం, గిరిజ, షావుకారు జానకి, కృష్ణ పమూరి సెట్టుకి
వస్తే “ఏదో తెచ్చి వుంటారు – ఇస్తారు” అని ఎదురుచూసే వారు అంతా.
గిరిజకి తేనాంపేటలో పెద్దమేడ వుండేది, మేడమీద ఏర్కండిషన్ గదులు. పెద్ద కారుండేది. ఎంతో దర్జాగా హీరోయిన్ స్థాయిలో కనిపించిన గిరిజ
ఎందుకో ఎలాగో రానురాను చితికి పోయింది. క్ మేడ, ఆ కారూ అవన్నీ
ఏమైపోయినాయో తెలీదు. మనిషి బక్కచిక్కిపోయి, పాలిపోయింది.
సినిమాలు తగ్గిపోయాయి. ఓ సినిమాలో గుడిసెలో వుండే ఒక బీద పాత్రకి
ఆవె పర్పనాలిటీ సరిపోతుందని
ఇచ్చారు. మూడు రోజులు షూటింగ్
చేశారు. తర్వాత ఆమెను మార్చి ఆ పాత్ర
| ఇంకొకరికి ఇచ్చారు! కారణం – ఆ
“| పాత్రకి పూర్వకథ వుందిట. ఆ కథలో
ఆవె బాగా ఐళ్వర్యవంతురాలు.
|| రానురాను ఆన్తిపాన్తులు పోయి,
చెడిపోయి. పేదది
అయిపోతుంది. “పేదకి పర్సనాలిటీ
సరిపోతుంది గాని, ముందు దృశ్యాల
మాటేమిటి?” అని దర్శకుడు, నిర్మాత
చర్చలు చేసి ఆమె పారితోషికం కొంత
చెల్లించి, ఆమెను మార్చేశారు. అటు తర్వాత ఆమె మరీ దౌర్భాగ్యస్థితి
అనుభవించింది. ఎక్కడి హాస్య పాత్రలు, ఎక్కడ గిరిజ? అంతటి దీనావస్ ‘సినిమా వారికి ఇది శాపం’ అని సర్ది చెప్పుకున్నా –
జరిగి (తిరగేస్తే గిరిజ)న స్థితి తలచుకుని,
చివరిదశ తలచుకుంటే ఆ గాధ పెద్దబాధే!
ఒక ఊపు వూపి, జనాన్ని తెగనవ్వించిన జంట,
రేలంగిరిజంట. ఆయా పాత్రల్లో గిరిజలేని రేలంగినీ,
రేలంగి లేని గిరిజనీ ఊహించుకోలేం.
సినిమా లన్నీ హాస్యంతో ని౦పేసిన గిరిజ జీవితం చివరి రోజుల్లో కష్టాలకడలి లో మునిగిపోవటం బాధ కలిగిస్తుంది కులదైవం వెలుగు నీడలు ,
జగదేక వీరునికద ,ఆరాధన సినిమాలలో గిరిజ చిరస్మరణీయమైన నటన ప్రదర్శించింది .
సశేషం
మీ గబ్బిట దుర్గాప్రసాద్ -15-2-22-ఉయ్యూరు