జ్ఞానదుడు మహర్షి నారదుడు –2

  జ్ఞానదుడు మహర్షి నారదుడు –2

 

 వరాహ పురాణాన్ని అనుసరించి నారదుడు సారస్వతుడు అనే బ్రాహ్మణుడు .సంసార భారం అంతా పుత్రుని పై పడేసి వనం లో తపస్సు చేశాడు ..విష్ణుమూర్తి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు .’’విష్ణు సాయుజ్యం కావాలి ‘’అని కోరాడు .తన తర్వాతవాడు బ్రహ్మ అనీ ,ఆ బ్రహ్మకు జన్మించి ,ఆ తర్వాత సాయుజ్యాన్ని పొందమని విష్ణువు చెప్పాడు .ఇతరులకు నీరు (జ్ఞానం )ఇస్టూ ఉంటావుకనుక ‘’నారదుడు ‘’గా ప్రసిద్ధి చెందు తావని అనుగ్రహిస్తాడు .ఈ విధం గా నారదుని జన్మ పరి పరి విధాలుగా పలుచోట్ల కన్పిస్తుంది .

              నారద జీవిత విశేషాలు

        బ్రహ్మ ,ప్రియల సుపుత్రుడైన నారదుడు బ్రహ్మ గారి ఆజ్ఞప్రకారం సృష్టి పెంపు చేయటానికి ఇష్టపడడు..సంసార పంకిలం లో దిగననీ ,మోహ బంధనం వద్దని ,కనుక తాను సృష్టి చేయ లేనని చెప్పుకొన్నాడు .బ్రహ్మ కు కోపం వచ్చి ‘’కాముకుడ వై  స్త్ర్ర్ లోలడవై ,శూద్ర యోని లో జన్మించమని శాపం ఇస్తాడు .అయితే బ్ర్రాహ్మణ సంపర్కం లో విష్ణు భక్తీ మాత్రం వెంట ఉంటుందని ఊరడిస్తాడు .నారదుడు కూడా కోపం తో తండ్రి బ్రహ్మ కు ‘’పూజా ,కవచాలు లేకుండా పోతాయని ‘’ప్రతి శాపం ఇస్తాడు .ఇది బ్రహ్మ వైవర్త్త పురాణ కద .

          నారద నారది

    వరాహ పురాణం.దేవీ భాగవతం  ప్రకారం ఒక సారి నారదుడు శ్వేత ద్వీపం ‘’వెళ్తాడు .అక్కడ మన్మధా కారులైన వాళ్ళు చాలా మంది కన్పిస్తారు .వారిలో విష్ణు మూర్తి ఎవరో తెలుసుకోలేక ఆయన్నే ప్రార్ధిస్తాడు .ఆయన ప్రత్యక్షమై వరం కోరుకో మంటే తనకు ‘’విష్ణు మాయలు ‘’తెలియ జేయమని ప్రార్ధిస్తాడు .సరేనని దగ్గరలో ఉన్న కొలువు లో స్నానం చేసి రమ్మంటాడు .మునిగి లేవగానే స్త్రీ గా మారి పోతాడు .చారుమతి అనే పేరు తో కాశీ రాజు కుమార్తె గా జన్మిస్తాడు .’’శిబి ‘’అనే వాడిని పెళ్లి చేసుకొన్నాడు నగ్న జిత్తి ,విప్రజిత్తి ,విచిత్తి ,చారు వక్త్రుడు ,చిత్తుడు అనే కొడుకులు పుట్టారు .తండ్రీ కొడుకులు దేశాలను జయిస్తూ కాశీ రాజు చేత చంప బడుతారు .చారుమతి భర్త్రు ,పుత్ర శోకం తో చితి పేర్చుకొని చని పోవటానికి సిద్ధమవుతుంటే ,పూర్వ రూపం పొంది నారడుదయ్యాడు .ఇది కలా /వైష్ణవ మాయా /అని చింతించి విష్ణు మహిమను తెలుసుకొన్నాడు .

       నారదుడు రావటం చూసి శ్రీ లక్ష్మి ,విష్ణువు దగ్గర నుంచి బయటకు వెళ్ళింది .తనేమో వృద్ధ తాపసి తనను చూసి తొలగటం ఏమిటి అని ప్రశ్నిస్తాడు .’’పర పురుషులను చూసి తొలగాలి కదా ‘’అంటాడు స్వామి .మాయ ఎంతటి పనైనా చేస్తున్దంటాడు విష్ణు మూర్తి .తన మాయా ప్రభావం చూపించమని కోరగా ,గరుడుని పై ఎక్కించి ,కన్యా కుబ్జం దగ్గర కొలను దగ్గర దింపి అందులో స్నానం చేసి రమ్మంటాడు .

           కొలను నుంచి బయట పడగానే అందమైన స్త్రీ గా మారి పోతాడు .విష్ణువు నెమ్మదిగా జారుకుంటాడు .తాళధ్వజుడనే రాజు మోహించి ,తన నగరానికి తీసుకు వెళ్తాడు .వివాహమాడి రాణి ని చేస్తాడు .పుత్ర సంతానం కలిగింది .కొంత కాలానికి శత్రువులు దండెత్తి కుమారులను సంహరిస్తారు .నారది విలపిస్తుంది .విష్ణువు వృద్ధ బ్రాహ్మణ రూపం లో వచ్చి ,పుత్రాదులు నిత్యం కాదని చెప్పి ,తన వెంట తీసుకొని వెళ్లి ,కొలను లో స్నానం చేయిస్తాడు .పూర్వరూపం వచ్చేస్తుంది .శ్రీ కృష్ణ మాయ స్త్రీ రూపం లో అనుభవించి రెండు సార్లు తెలుసుకొన్నాడు .అంటే విష్ణు భక్తీ గాఢం చేయటానికి ఆ విష్ణు మూర్తి యే పరీక్షలు చేసి నిగ్గు తేల్చాడు .నారదుడిని జ్ఞాన సార సంపన్నుని చేశాడు .

           సశేషం

             మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ -2-3-13-ఉయ్యూరు

      .

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in కవితలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.