బక దాల్భ్యుడు -7

బక దాల్భ్యుడు -7

ఋగ్వేదం 10.136.1లో కేశిని అగ్ని వాహకుడిగా ,విషవాహకుడుగా ,రెండులోకాల వాహకుడుగా చెప్పింది-‘’కేశిన్ ఆగ్నిం కేశి విషం ,కేశి భిభర్తి రోదశి’’.వ్రాత్యులను  విష బక్షకులుగా పేర్కొన్నారు చాలాచోట్ల .పిబి 17.1.9’’గరగిరో వా –‘’.ఇదేమంత్రం లో కేశి విషాన్ని రుద్రునితోపాటు అదే పాత్రతో తాగాడు -10.136.7.’’కేశి విషస్య పాత్రేన యద్ రుద్రేనా పిబత్ సహా ‘’.మరోచోట భూమి ,స్వర్గం కేశి పై ఆధారపడి ఉన్నాయి .ఈభావమే బ్రాహ్మణం లో కర్మకాండ విషయాలలో వచ్చిన సందిగ్ధం గా చెప్పి కేశిని ముఖ్యపాత్రగా చూపింది .ఈలోకం ,పరలోకం భవిష్యత్ నిర్ణయం చేయబడింది .ఎస్ బి -11.8.4,జెబి2.279-280.

  ఇతర దాల్భ్యులు –బక,కేశి దాల్భ్యులతోపాటు ఇతరవైదిక పాత్రలు దాల్భ్య /దార్భ్య ఉన్నాయి .వీరే రథ వీతి,రధ ప్రోత ,చైకితాయన లేక బ్రహ్మదత్త చైకితాయన  మరియు నాగారి . వీరికి ఒక్కో కథ మాత్రమె ఉన్నది .ఈ పేర్ల వెనుక వీరివ్యక్తిత్వానికి సంబంధించిన విషయం ఉండటమే కాక ఇతర దాల్భ్యులతో సమానమైన కొన్ని విషయాలుంటాయి .రథవీతి దార్భ్యుడు రుగ్వేదమూలాలున్నవాడు .ఇతనిపేరు 5.61.17-19లో ఉన్నది .ఈమంత్రాలకు వ్యాఖ్యానాలున్నాయి .బృహద్దేవత –రథ వీతికధను ‘’శ్యావాశ్వ ‘’ఉపాఖ్యానం లో చెప్పాడు .ఋగ్వేద కథనం ప్రకారం అవి మరుత్తులకు అంకితంగా  చెప్పబడిన ఇతిహాసమంత్రాలు.ఇందులో మొదటిది శ్యావాశ్వ రాత్రి దేవతను ఉద్దేశించి చేసిన స్తుతి .ఇది గిరో రథి అయిన దార్భ్యుని చేరాలని కోరుతాడు .మిగిలిన రెండుపాదాలు దార్భ్యుడిని తన పోషకుడు,గోమతి నది వద్ద ఉన్న పర్వతాలలో ఉండే సోమయాజి  రథవీతి  గా చెప్పాయి .ఋగ్వేదం లో మనం చెప్పుకొన్న పై మంత్రం ప్రకారం రథ వీతి దార్భుని రాజర్షిగా చెప్పింది .యితడు యాగం చేయగోరి అత్రి  మహర్షిని దర్శించిఆయనకుమారుడు అర్చానస ఋషిని నేతృత్వం వహించమని కోరాడు .అర్చానసుడు తనకుమారుడు అంతగా నిష్ణాతుడుకాని  శ్యావశ్వ తో వెళ్లి ,యాగం జరిపిస్తూ, రథ వీతి కూతురిని చూసి ,తండ్రీకొడుకు ఇద్దరూ ఆమెను పెళ్ళాడాలనుకొన్నారు .ఈ పెళ్ళి కి రాజు అంగీకరించినా రాణి అడ్డు చెప్పింది-కారణ౦  శ్యావశ్య అసలైన రుషికాడు అని .యాగ౦ యిపోయాక పెళ్ళికి తిరస్కరింపబడిన తండ్రీకొడుకులు ఇంటికి బయల్దేరారు  .దారిలో వారికి విడదశ్వ రుషి పుత్రులైన ఇద్దరు రాకుమారులు కనిపించారు .ఇందులో ఒకరికి రాణి ఉన్నది . చివరికి  శ్యావశ్వ ఋషియై మంత్ర వేత్తకావాలను కొన్నాడు .మొదట మరుత్తులను స్తోత్రంతో ప్రసన్నులను చేసుకొని  బంగారం కవచాలు పొందాడు .చివరికి రాత్రిదేవత దగ్గరకు వెళ్లి  స్తోత్రాలతో మెప్పించి ,ఆమె అనుగ్రహంతో రుషి, మంత్రవేత్త అయ్యాడు .అప్పుడు రథ వీతి తనకూతురునిచ్చి పెళ్లి చేశాడు

  రధప్రోత దార్భ్యుడు పేరుతొ మరో దార్భ్యుడు మైత్రాయణి సంహిత లోకనిపిస్తాడు . దుర్వాసనకొట్టే ఒకమనిషికి అది పోగొట్టేవిషయం లో వస్తాడు .దీనికి విరుగుడు అగ్ని సురభిమతి కి 8భాగాల హవిస్సు సమర్పించాలి. ఈ యాగ౦  రథప్రోత దాల్బ్యుడు కోసమే .ద్వంద్వ కౌలాకవతి చెప్పినదాన్నిబట్టి ఇద్దరు నిర్వాహకులను ఏర్పాటు చేశారు .ఇదేకాకుండా మరో రథప్రోతుడు వాజసనేయ సంహిత 15.17 పశ్చిమ దిక్కు దేవతగా చెప్పబడ్డాడు .15.15.19మంత్రాలలో దిశాధిపతులు, వారి రక్షకులు,ఇద్దరు అప్సరసలు  చెప్పబడ్డారు –‘’సేనానీగ్రామాన్యౌ’’అయిదవ దిక్కు ఉపరిదిశ.వీరితోపాటు అనేక రథాల పేర్లుకూడా ఉన్నాయి

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -2-6-20-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.