బక దాల్భ్యుడు -15
మాయారూప మరో దేవుడు –
బక ,మార్కండేయు లిద్దరూ అధిక గర్వం తో పతనం చెందారు .బౌద్ధ జాతక కథలూ ఇదే చెప్పాయి.బకబ్రహ్మజాతకం అనే 405జాతక కథలో బకుడు స్వర్గ లోక దేవుడైన బ్రహ్మ .ఆయన భూమిపై చేసిన తపస్సు ఫలితంగా అనేక కల్పాలు వేర్వేరు బ్రహ్మలోకాల లో ఉన్నాడు.అభస్సార బ్రహ్మలోకం లో ఉండగా,అంతకంటే ఉత్కృష్ట స్థితి లేదు అని పొరబాటుగా భావించాడు.ఈ బ్రహ్మలోకానికి బుద్ధుడు వచ్చినపుడు బకుడు ఆయనకు తాను మనసులో అనుకొన్నది చెప్పాడు .అతడి గత జన్మల విషయాలు చెప్పి అతడి అభిప్రాయం తప్పు అని తెలియ జేయాగా తప్పు తెలుసుకొన్నాడు .బుద్ధుడు పది వేల బ్రాహ్మల మనసులకు విముక్తి కలిగించాడు.అంటే బుద్ధుడు బకుడిని గతజన్మలలో కలుసు కొన్నాడు .
బకుడు ఒక జన్మలో ముసలి తపస్వి కేశవుడు గా ఉండగా ,బుద్ధుడు ఆయనకు యువ కు డైన కప్పా అనే శిష్యుడు .ఇదే కేశవ జాతక -346.ఒకసారి వారణాసి రాజు బకుని అతని శిష్యులను హిమాలయాలకు పంపి ,ఆయన్ను తన రాజభవనం లో ముసలితనం గడపమని కోరాడు .అక్కడ ఉండగా జబ్బు పడి ,ముఖ్యశిష్యుడు కప్పా ను కలుసుకున్నతర్వాతనే జబ్బు తగ్గింది .జైమినీయ అశ్వ మేధం లో బక, కృష్ణుల కలయిక ,జాతకకథలలో బ్రహ్మలోక బుద్ధుల కలయిక ఒకే మాదిరిగా ఉన్నాయి .కేశవ అంటే కేశి దాల్భ్యుడు .జాతక కథలప్రకారం ఒకే బకుడు ఒక జన్మలో కేశి దాల్భ్యుడుగా ,మరో జన్మలో బకదాల్భ్యుడుగా పుట్టాడన్నమాట .. పక్షిరాజు
కొన్ని ఆఖ్యానాలలో బకుడు రాజుగా చెప్పబడ్డాడు ఆ రాచ పక్షి పూర్వజన్మలో పక్షిగాలేక పక్షిరాజుగా చెప్పబడ్డాడు .ఆరాజ బకుడు దైవాంశ సంభూతుడు అయిఉండాలి .పక్షిరాజు కు విశేషమైన విషయం ఉండి ఉండాలి .కునాల జాతకం-536 ప్రకారం రాజరిక బకుడు వారణాసి ప్రభువు .ఇందులో రాజకునాల ఆటే బుద్ధుడి పూర్వ జన్మ .ఆ కునాలపక్షికి ఎప్పుడూ 3500 కోడి పక్షులు కాపలాగా వాహకులుగా ఉంటాయి . ఆ ఆడ పక్షులు గమ్యం లేకుండా గాలి ఎటు వీస్తే అటు ఆయన్ను మోసుకుపోవటం తో విసుగుపుట్టి ,వాటి అవిదేయత,కృతఘ్నత కు తగిన శాస్తిగా అవి నశించాలని శాపమిచ్చాడు .
కౌవెల్(1895-1907) సేకరించిన బౌద్ధజాతక కథలలో v-236-240 ప్రకారం మంచి ఉపజ్ఞ ఉన్నమానవ రాజు బకుడు బీద అత్యంత అందవికార యువతి ‘’పంచపాప’’ ను ప్రేమించాడు .అందవికారి అయినా ఆమె చేతి మెత్తని స్పర్శతో మగవారిని ఆకర్షించేది .అనేక సందర్భాల పరిచయంతో ఆమెను దేవేరిగా చేసుకొన్నాడు .తర్వాత ఆమెను నది అవతలి తీరాన ఉన్న పారవీయ రాజుతో పంచుకొన్నాడు .కనుక పంచపాప నది అవతలికి వెళ్లి అతనితో కొన్ని రోజులు గడిపి వస్తూండేది .ఇలా ఆ ఇద్దరినీ నావ నడిపే ముసలి బట్టతలకుంటి వాడి సాయంతో మోసం చేసింది . .
మరొక రాజరిక బకుడు భారతం శాంతి పర్వం12.162-28 లో కనిపిస్తాడు .బకరాజ బకాధిపతి బకేంద్ర మొదలైన పేర్లతో ద్వేషపూరిత కొంగలరాజు ,దుర్మార్గ బ్రాహ్మణుడు గౌతముని తో కనిపిస్తాడు .ఉత్తర మ్లేచ్చులమధ్య ఈ కథ జరుగుతుంది .మధ్యదేశంలో సద్బ్రాహ్మణ కులం లో పుట్టిన గౌతముడు ఉత్తరాన స్థిరరపడ్డాడు .దస్యుల గ్రామంలో శూద్ర భార్యతో బోయవాడుగా జీవిస్తున్నాడు -12.162.28-37.ఒకరోజు పక్షులవేటకోసం సముద్రం వైపుకు వెడుతూ మధ్యలో ఒక అడవిలో దారి తప్పాడు .అక్కడ ఒక మెరిసే పక్షి కనిపించింది .అది బకరాజు .అతడు దక్ష ప్రజాపతికూతురుదేవకన్య కు ,కశ్యప మహర్షికి జన్మించినవాడు .ఆ పక్షిపేరు రాజధర్మ .అప్పుడే అతడు నాడీ జంఘ పేరుతో బ్రహ్మలోకం లో ఉంటూ ఇప్పుడు తన ఇంటికి తిరిగి వస్తున్నాడు -12.163.17-20.గౌతముడికి రాజధర్మ గొప్ప ఆతిధ్యమిచ్చాడు .తాను పక్షుల వేటకు సముద్ర తీరానికి వెడుతున్నానని గౌతముడు చెప్పగా రాజధర్మ అతడిని తనప్రియమిత్రుడు రాక్షసరాజు విరూపాక్షుని దగ్గరకు వెళ్ళమని ,అతడు ఆషాఢ,మాఘ ,కార్తీక పౌర్ణములనాడు బ్రాహ్మణులకు భూరి దక్షిణ కానుకలు ఇస్తాడని చెప్పాడు .అలాగే వెళ్లి రాక్షసరాజు ఇచ్చిన అపార స్వర్ణం మోసుకుంటూ మళ్ళీ రాజధర్మ ఇంటికి వచ్చి దారిలో ఏమీ తినకపోవటం తో ఆకలి ఎక్కువై విశ్వాసఘాతుకంగా ఆపక్షిరాజు నే చంపి తినేశాడు .ఇది తెలిసి విరూపాక్షుడు తన సైన్యాన్ని గౌతముడిని చంపమనిపంపితే వాళ్ళు అతడిని ముక్కలు ముక్కలుగా నరకగా రాక్షసులు ,దస్యులు కూడా అలాంటి కృతఘ్నుడి మాంసం తినటానికి నిరాకరించారు .చివరికి సురభి దేవత బకుడిని పునరుద్ధరించింది .ఆశ్చర్యంగా ఆ పక్షిరాజు ఆమెను గౌతముడిని కూడాబ్రతికించమని కోరింది .అలాగే చేసింది సురభి .బకుడు ఆబ్రాహ్మణుడిని సంతోషంగా కౌగలించుకొన్నాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -13-6-20-ఉయ్యూరు
