పూర్వ ఆంగ్ల కవుల ముచ్చట్లు -39
క్లాసికల్ స్కాలర్ –జాన్ కీట్స్
సాధారణ చదువు మాత్రమె ఉన్నా ,వంశం లో ఎవారూ క్లాసికల్ సాహిత్యాన్ని చదవక పోయినా జాన్ కీట్స్ మాత్రం క్లాసికల్ స్కాలర్ అయ్యాడు .తాత లండన్ లో గుర్రాల శాల నిర్వాహకుడు .తండ్రి థామస్ కీట్స్ మాత్రం అందులో పనివాడైనా దాని యజమాని కూతుర్ని పెళ్లి చేసుకొన్న అదృష్టవంతుడు .తొలి సంతానమే జాన్ కీట్స్ .స్వాన్ అండ్ హోప్ స్తేబిల్స్ లో 1795 ఇరవై తొమ్మిదిన పుట్టాడు . బాల్యం బాగానే గడిచింది .పదేళ్ళ వయసులో తండ్రి గుర్రం కిందపదేస్తే చనిపోయాడు .మూడు నెలల తర్వాత తల్లి వేరొకరిని పెళ్ళాడి వెళ్లి పోయింది .అమ్మామ్మ జెన్నింగ్స్ దగ్గరకు పిల్లలు చేరారు .తల్లి అప్పుడప్పుడు వచ్చి పిల్లల్ని చూసి వెళ్ళేది .తల్లి మరణానికి ముందు జాన్ ,అతని తమ్ముడు జార్జి యెన్ ఫీల్డ్ స్కూల్ లో చేరారు .అమ్మమ్మ ఈ పిల్లలకు గార్దియన్లుగా ఇద్దరినీ ఏర్పరచింది .అమ్మమ్మ చావు తర్వాత బంధువులే లేని వారయ్యారు .అమ్మమ్మ ఆస్తి తగాదాల్లో పడింది .ఈ తగాదా కీట్స్ మరణించిన సంవత్సరానికి కాని తేలలేదు .
కీట్స్ స్కూల్ జీవితం హుషారుగానే గడిచింది .అక్కడి హెడ్ మాస్టర్ జాన్ క్లార్క్ కీట్స్ పై గొప్ప ప్రభావం కలిగించాడు .కొత్త భావాలు ఆలోచనలు ,కళాత్మక విషయాలను ప్రోత్సహించేవాడు .కీట్స్ కంటే ఎనిమిదేళ్ళ పెద్ద వాడైన ఆయనకొడుకు చార్లెస్ అక్కడే టీచర్ గా పని చేస్తున్నాడు .కీట్స్ లోని కవిని గుర్తించారు తండ్రీ కొడుకులు .కీట్స్ కు ఆటలంటే ఇష్టం కుస్తీలు ,మరీ ఇష్టం ఎవరితోనైనా యే క్షణాన్నైనా పోటీపడి పీటీ దెబ్బ కొట్టగలదాడసవాలు చేసేవాడు .నిజానికి కీట్స్ సన్నగా బలహీనం గా ఉండేవాడు .ఒక రోజు పోటీలో రెచ్చిపోయి ఒకడి చెవులు కొరికి జేబులో వేసుకొన్నాడు కీట్స్ .
మహా కావ్యాలు కంట బడ్డాయి .రాబిన్సన్ క్రూసో ,పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ లను దీక్షగా చదివాడు .ఓద్ రాసిన మెటా మార్ఫోసిస్ అనువాదాన్ని చదివాడు . క్లాసికల్ డిక్షనరి అనువాదాన్ని పూర్తీ చేశాడు .’’ఎనీద్ ‘’కు వచన అనువాదం చేశాడు ‘’ఇంట్రడక్షన్ ఫర్ ఆస్ట్రానమి ‘’, మిల్టన్ పోప్ థామ్సన్ మొదలైన కోటే షాన్ లకు రెండు బహుమతులు పొందాడు . ‘’ఎడిక్షనరి ఆఫ్ మర్కండైజ్ ‘’ పై మోజేర్పడింది .సర్జన్ థామస్ హామ్మండ్ దగ్గర అప్రెంటిస్ చేశాడు .తమ్ముడు బుక్ కీపింగ్ లో చేరాడు . ఇంటికి రెండుమైళ్ళ దూరం లో ఉన్న కౌడేన్ క్లార్క్ దగ్గరకు వారానికోసారి వెళ్లి అతను చదివేవి వినేవాడు .అది రొమాంటిక్ కాలం కనుక పాత ధోరణులకు స్వస్తి చెప్పి కొత్తగా ఇద్దరూ ఆలోచించేవారు .పూర్వకవుల భావాలను స్పెన్సర్ స్టాంజాలలో అద్భుతం గా కీట్స్ రాసి వినిపించేవాడు .కౌడేన్ దగ్గర నుంచి ‘’ది ఫైరీ క్వీన్ ‘’ను అరువుగా తీసుకొని ఆశ్విక వేగం తో చదివి పారేశాడు .నాలుగేళ్ళు అప్రాంటిస్ చేసిన తర్వాత స్వంత ఇల్లే లేని ఇంటిమీద ధ్యాస మళ్ళింది .అమ్మమ్మ చని పోయింది తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎవరి వ్యాపకాలలో వాళ్ళున్నారు .డాక్టర్ అవాలనే కోరిక ఉండేది కాని సర్జన్ అవటం ఇస్టంలేదు.హామ్మన్డ్స్ హాస్పిటల్ వదిలేసి లండన్ లో గీస్ హాస్పిటల్ లో చేరాడు .మేటీరియామేదికా ,అనాటమీ మిడ్ వైఫ్ బాటని లెక్చర్లు వినేవాడు . ఫ్లవర్ డ్రాయింగ్ లో పండి పోయాడు .తోటి వాడు హెన్రీ స్టీఫెన్స్ సర్జన్ అయి పోయాడు .కీట్స్ మనసు మాత్రం దేని మీదో ఉంది .కూపర్ కజిన్ పై మనసు పారేసుకొన్నాడు .తొమ్మిది నెలల తర్వాతమందుల దుకాణం పెట్టుకోవటానికి సర్టిఫికేట్ ఇచ్చారు .మందుల లక్షణాలు వాటి కంపోజిష న్ లు గా గ్రహించాడు .ఇంత చేస్తున్నా’’ మనసంతా నువ్వే’’ అంటూ కవిత్వం మీదే ఉండిపోయింది .కవిత్వ శక్తికి దాసోహమన్నాడు .కౌడేన్ క్లార్క్ తో ఒక సారి ‘’The other day during a lecture there came a sunbeam into the room and with it a whole troop of creatures floating in the ray and I was off with them into a fairy land ‘’ అంటూ స్వప్న లోకం లో విహరించాడు .జబ్బు పడ్డవారికి నయం చేయటం తనకు చేతకానిపని అని గ్రహించాడు .చివరిసారిగా ఒక పేషెంట్ ఆర్టేరిను ఓపెన్ చేసి కలల్లో తేలిపోయి అద్భుతాలు చూసి ఇక మళ్ళీ సర్జికల్ సామగ్రి జోలికి వెళ్ళలేదని కీట్స్ స్వయం గా చెప్పాడు .
ఇరవై ఒకటి లో కొన్ని కవితలే రాశాడు .ఇమిటేషన్ ఆఫ్ స్పెన్సర్ ‘’అనే సానెట్ రాశాడు .తను ఇంకా సర్జన్ గా ఉండలేనని తేల్చి చెప్పేశాడు .కీట్స్ కు సన్నిహితులు అతని సోదరులే .సేవేర్న్ అనే చిత్రకారుడు కీట్స్ అద్భుత చిత్రాన్ని గీశాడు .చాలా ముచ్చటగా కీట్స్ కనీ పిస్తాడు .లండన్ లో చాపి సై డ్ జిల్లాలో సోదరులతో కొంతకాలం ఉన్నాడు .ఒక రోజు ఉదయం పదింటికి కీట్స్ ఆ రాత్రి అంతా నిద్రపోకుండా మేలుకొని రాసిన ‘’ఆన్ ఫస్ట్ లుకింగ్ ఇంటు చాప్మాన్స్ హోమర్ ‘’ ‘’much have I travelled in the realms of gold –and many goodly states and kingdoms seen ‘’అని ప్రారంభమయ్యే సానెట్ చదివి వినిపించాడు .పసిఫిక్ సముద్ర అన్వేషణ పై ‘’కోర్తెజ్ ‘’కవిత రాశాడు .వీటి వ్రాత ప్రతులు ఉన్నాయి . హంట్ రాసిన దానికి ఫైన్ వేసి జైల్లో పెట్టారు . ‘’కవిత్వం కాన్షస్ తో రాసేది కాదు అన్ కాన్షస్ గా రాసేదని’’ కీట్స్ అభిప్రాయం ‘’.a drainless shower –of light is poesy –it is the supreme of power –its might half –slumbering on its own right arm ‘అన్నాడు .హంట్ బృందం లో కీట్స్ సభ్యుడైనాడు .వర్డ్స్ వర్హ్ కీట్స్ ను మెచ్చాడు .హుంట్ తో సాన్నిహిత్యం కీట్స్ కు ఎంతో మేలు చేసింది .’’the poetry of earth is never dead ‘’తో ప్రారంభమైన కవిత అందరిని మెప్పించింది ‘’ ఆ న్ దిగ్రాస్ హాపర్ అండ్ ది క్రికెట్ ‘’మొదలైనవి పేరొందాయి .సమీక్షలూ అనుకూలం గానే వస్తున్నాయి .
ఈ ఆనందం ఎక్కువ కాలం లేదు .సోదరుడు టాం అనారోగ్యం తో తిరిగి వచ్చాడు .అందరూకలిసి వెల్ వాక్ లో స్తిరపడ్డారు .హాంప్ స్టేడ్ బృందం పెరిగి పోయింది .కీట్స్ ధ్యాస అంతా కవిత్వం మీదనే .కవిత్వం రాయకుండా ఒక్క క్షణం కూడా ఉండేవాడు కాదు .షేక్స్ పియర్ ను చదివితే చాలు అతడొక విజ్ఞాన సర్వస్వం అనే వాడు .’’ఎందిమియాన్ ‘’ ‘’తన ప్రాజ్ఞా సర్వస్వం అని తన శక్తి అంతా ధార పోసి రాశానని చెప్పాడు .దాన్ని ‘’పోలార్ స్టార్ ఆఫ్ పోయిట్రీ ‘’అన్నాడు .చాంపియన్ పత్రిక లో డ్రామా క్రిటిక్ గా ఉన్న రేనాల్డ్స్ సెలవలకు వెడుతూ బాధ్యతా కీట్స్ మీద ఉంచాడు ఒదేల్లో రిచర్డ్ త్రీ ,నాటకాలు చూసి సమీక్ష చేశాడు వర్డ్స్ వర్త తో కలయిక హుషా రునివ్వలేదు తన ప్రాభవం తగ్గి పోతోందని ఆ లేక్ పోయేట్ బాధ పడుతున్నాడు .కీట్స్ లండన్ వదిలి జార్జి స్థానం లో తీగ్ మౌట్ లో పని చేశాడు .
1818 ఏప్రిల్ లో ‘’ఎందిమియాన్ ‘’ప్రచురించాడు .సమీక్షలు చాలా వ్యతిరేకం గా వచ్చాయి .అందులోని’’a thing of beauty is a joy for ever ‘’ అందరి నాలుకల మీదా నాట్యమాడింది .విమర్శ జడివాన నుంచి బయట పడటానికి స్విట్జర్లాండ్ వెళ్లాడు .బ్రౌన్ తోకలిసి ఐర్లాండ్ చూశాడు .వాతావరణం బాగోలేక వారానికే బెల్ఫాస్ట్ చేరారు అక్కడి నుండి బాలన్త్రే వెళ్లి విపరీతమైన వర్షాలు చలి దగ్గు జలుబు పట్టి క్షయ వ్యాధి లక్షణాలు కనిపించాయి .హాంప్ స్టేడ్ కు తిరిగోచ్చేశారు .టాం పరిస్తితి మరీ దారుణం .అతన్ని కనీ పెట్టి ఉంటున్నాడు కీట్స్ .రివ్యూలు డిప్రెషన్ తెప్పించాయి క్వార్తెర్లి రివ్యు కోకేరిస్కూల్ ,ఎందేమియాన్ లపై విషమే కక్కినా మిగిలిన వారికంటే కొంత నయం .పుస్తకాలు అమ్ముడుపోక డబ్బు ఇబ్బంది ఎక్కువైంది .బైరన్ సూతీ మూర్ లు ఆర్ధిక సాయం చేసి నిల బెట్టారు .టాం చనిపోయాడు తల్లికి, టాం కు ,వచ్చిన క్షయ తననూ కబ ళించివేస్తుందని తెలుసుకొన్నాడు .
ఇంతలో మరో ఎదురు దెబ్బ తగిలింది .ఫాన్నీ ప్రేమ అనుకొన్నట్లు ముందుకు సాగటం లేదు .భవిష్యత్తు అంధకారం గా ఉంది .విజయం పొందలేని కవి అని పించుకొన్నాడు .వారిద్దరి మధ్యా ప్రేమలేఖలు 1936లో మాత్రమె ప్రచురణ అయ్యాయి .ఆమె కు కీట్స్ పై ఆరాధన తగ్గలేదు .విధవ రాలు వేషం తో గడిపింది .1818లో ‘’ట్రూ థామస్ ‘’అనే బాలడ్ గొప్పగా రాశాడు .సోదరుడు జార్జి స్పెక్యులేషన్ లో బోలెడు సొమ్ము పోగొట్టుకొన్నాడు .ఎటూ పాలుపోక జర్నలిజం లో ఉండాలని మెడిసిన్ ప్రాక్టీస్ చేయాలని ఊగిస లాడాడు ..’’లామియా ‘’ఒతో ది గ్రేట్ ‘’రాశాడు .ఫాన్ని లేకుండా బతకలేనని చెప్పుతున్నాడు .ఎనిమిది వందల లైన్ ల ‘’ది కాప్ అండ్ ది బెల్ ‘’ను సాహసోపేతం గా రాశాడు .బాగా డిప్రేస్ అయ్యాడు .ఏడు వందల పౌండ్లు ఆస్తిని అమ్మి జార్జి కిచ్చాడు వ్యాపారం కోసం .అదేమీ కీట్స్ స్వంతం కాదని కీట్స్ చనిపోయిన తర్వాత జార్జి చెప్పటం విడ్డూరం .
1820 ఫిబ్రవరి లో ఫాన్ని కి పరిస్తితి వివరిస్తూ జాబు రాశాడు. కీట్స్ కు చావు ఘడియలు దగ్గర పడ్డాయి .చలి దాగ్గు బలహీనత బాధిస్తున్నాయి రక్తం కక్కు కొంటున్నాడు .కొవ్వొత్తి వెలుగులో దుప్పటిపై కక్కిన రక్తాన్ని తానె పరీక్షించి చూసి ‘’that drop of blood is my death warrant ‘’అని తేల్చి చెప్పేశాడు .హేమరేజే లు ఎక్కువైనాయి .మార్చిలో కొంత గుణం కనిపించింది .లండన్ వెళ్లి ‘’క్రిస్ట్ ఎంట్రి ఇంటు జెరూసలెం ‘చూద్దామను కొన్నాడు .’’లామియా ఇసబెల్ల ,ది ఈవ్ ఆఫ్ సెయింట్ ఆగ్నెస్ ‘’మొదలైన పోయెమ్స్ చివరి వాల్యూం లో చేర్చాడు .1820జులై లో ప్రింట్ చేశాడు .దీనిపై మంచి స్పందనే వచ్చింది .అమ్మకాలు జోరుగా సాగాయి .ఇంగ్లాండ్ లో రాజకీయ దుమారం రేగింది నాలుగవ జార్జి భార్య ను వదిలేశాడు దీనితో అయిదు వందల కాపీలే అమ్ముడయ్యాయి .’’ఇసబెల్లా ఆర్ ది పాట్ ఆఫ్ బాసిల్ ‘’బోకాసియో లోని ఒక కద. ఈవ్ ఆఫ్ ఆగ్నెస్ గొప్ప విజయమే .సెప్టెంబర్ పద్దెనిమిదిన జోసెఫ్ సేవేర్న్ తోకలిసి కీట్స్ రొమ్ కు నావ మీద బయల్దేరాడు .నెల రోజులు ప్రయాణించి చేరారు .
కీట్స్ చివరి రెండు నెలలు మానసిక ఆందోళన శారీరక బాధ తో గడిపాడు .అసూయ ,ఆవేశాలకు అతీతం గా ఉన్నాడు .తన దీన స్తితిని నేపుల్స్ చేరిన తర్వాత బ్రౌన్ కు జాబు రాసి తెలిపాడు .బాధ విపరీతమై రాయలేక పోయే వాడు .23-2-1821న సేవేర్న్ ను పిలిచి ‘’lift me up.iam dying .don;t be frightened .thank god it;s come ‘’అని చివరి మాటలు అని ఊపిరి అందకఏడు గంటలు బాధపడి అర్ధ రాత్రి అసువులు బాశాడు కీట్స్ కవి .రెండు రోజుల తర్వాతా రొమ్ లోని ప్రోటేస్టంట్ సేమేటరి లో ఖననం చేశారు .ఆయన రాసిన కవితా (ఎపితా )’’here lies one whose name was writ in water ‘’ఉన్న ఫలకాన్ని ఉంచారు .కీట్స్ కోరిక మేరకు సమాధిపై అతని పేరు రాయలేదు .కవిగా అయిదేళ్ళ కాలమే జీవించాడు ..తన కవిత్వాన్ని సీరియస్ గా రాశాడు కాని గర్వం తో పొగరుతో రాయలేదు .కీట్స్ కవిత్వం అంటే ఒక భావోద్రేకమే కాని ఆలోచనా పరం కాదంటారు .ఇది అబద్ధం అది ఆలోచన భావోద్రేక సమ్మేలనమే .అతని ఊహకు ప్రతీకయే .సవ్యమార్గం లో జాగ్రత్తగా ఉండమనే కీట్స్ సందేశం .ఇంద్రియాతీత భావన కు రూప కల్పన చేశాడు నైటింగేల్ కవితలో గౌరవ ఆరాధననుంచి యదార్దానికి ప్రయాణించాడు .కీట్స్ కు ఒక దివ్యమైన కల ఉండేది అదే ‘’a dream of a world made not only lovelier but worthier of living .it was a pursuit of a dedicated poet ,a tragic lover ,and a brave man ,who wounded by derision and weakened by a fatal disease ,confronted death with a deathless vision ‘’.
ఐదారేళ్ళు మాత్రమె కవిగా ఉన్నా కీట్స్ కవిత్వాన్ని ఇప్పటికీ ఆరాదిస్తూనే ఉన్నారు .ఓడ్స్ మీద రసపట్టు ఉన్న కవి .టెన్నిసన్ ఇలియట్ లను ప్రభావితం చేశాడు .రొమాంటిక్ కవిత్వం లో షెల్లీ కీట్స్ లు ధ్రువ తారలు గా నిలిచారు . కీఎత్స్ రాసిన ఉత్తరాలకు కూడా సాహిత్య గౌరవం అమితం గా ఉంది .
![]()
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-6-14-ఉయ్యూరు
