సాహిత్యమే శ్వాసగా జీవించిన లూయిస్ అంటర్ మేయర్ –
రచన –గబ్బిట దుర్గా ప్రసాద్
శతాధిక గ్రంధ కర్త లూయిస్ అంటర్ మేయర్ అమెరికా కవి ,జీవిత చరిత్ర కారుడు ,అగ్రశ్రేణి విమర్శకుడు ,పత్రికా సంపాదకుడు ,బహుముఖ ప్రజ్ఞా శాలి .అమెరికా ప్రభుత్వ పద్నాలుగవ ఆస్థానకవి .వెయ్యేళ్ళ ఆంగ్ల కవిత్వం లో కవిత్వాన్ని మలుపు తిప్పిన ఇంగ్లాండ్ ,అమెరికన్ కవుల గురించి ,సంఘటనల గురించి అత్యద్భుతమైన ‘’లైవ్స్ ఆఫ్ ది పోయేట్స్ ‘’అనే మహా గ్రంధాన్ని 1959లో రాశాడు .భావుకత ఉన్న కవి .ఫస్ట్ లవ్ ఫ్రెంచ్ ,చాలెంజ్ సెంచరి ,వన్ అండ్ వన్ అండ్ వన్ మొదలైన ఇరవైకి పైగా కవితా సంపుటులను ,’ఫ్రం అనదర్ వరల్డ్ ,బైగాన్స్ అనే స్వీయ చరిత్రలను రాసుకున్నాడు .ప్లె ఇన్ పోయెట్రి ,ది లోఎస్ట్ ఫారం ఆఫ్ విట్ ,ది పర్సూట్ ఆఫ్ పోయెట్రి మొదలైన ఆరు వ్యాస సంపుటులు రాసి ప్రచురించాడు .మోజెస్ నవల ,దిడాగ్ ఆఫ్ పంపే మున్నగు ఏడు కాల్పనిక సాహిత్య పుస్తకాలు రాసి పాఠకులకు చేరువయ్యాడు .ట్రెజరీ ఆఫ్ గ్రేట్ పోయెమ్స్ ,మోడరన్ అమెరికన్ పోయెట్రి ,మోడరన్ బ్రిటిష్ పోయెట్రి ,న్యు సాంగ్స్ ఫర్ న్యు వాయిసెస్,గెలాక్సీ ఆఫ్ వేర్స్ , ట్రెజరీ ఆఫ్ లాఫ్టర్ , ఆంతాలజి ఆఫ్ న్యు ఇంగ్లాండ్ బెస్ట్ పోఎట్స్ ,హ్యూమర్ యాన్యువల్,ది గోల్డెన్ బుక్ ఆఫ్ పోయెమ్స్ ఫర్ ది వెరీ యంగ్ మొదలైనముప్ఫైకి పైగా జీవిత చరిత్రలను రాసి వెలుగులు ప్రసరింప జేశాడు .వండర్ ఫుల్ అడ్వెంచర్స్ ఆఫ్ పాల్ బన్యన్ ,ఈసప్స్ ఫేబుల్స్ ,వరల్డ్స్ గ్రేట్ స్టోరీస్ మొదలైన అనువాద గ్రంధాలను డజనుకు పైగా వెలువరించాడు .బాల సాహిత్యాన్నీ సుసంపన్నం చేశాడు .
1885అక్టోబర్ ఒకటిన న్యూయార్క్ లో జన్మించిన మేయర్ ఒక జామెట్రీ లెక్క చెయ్య లేక పోయిందుకు గ్రాడ్యుయేట్ కాలేక పోయాడు .ఇరవై ఏళ్ళు తీవ్ర కృషి చేసి సాహిత్య సంస్కృతులను స్వయం గా అభ్యసించి ,ఏ యూని వర్సిటీ లో చదివిన దానికంటే అధిక జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు .ఇంగ్లాండ్ వెళ్లి కొంతకాలం ఉండి ,ఆస్ట్రియ , ఇటలీలు చూసి అమెరికాకు తిరివచ్చి రచనా వ్యాసంగం లోను ,సాహిత్యోపన్యాసాల తోనూ ,వ్యవసాయం తోను కాలం గడిపాడు .అనేక యూని వర్సిటీలలో ‘’పోయేట్ ఇన్ రెసిడెన్స్ ‘’గా గౌరవం పొందాడు .యుద్ధ సమాచార రచయితగా ,ఆర్మడ్ సర్వీసెస్ ఎడిషన్ లకు సంపాదకుడిగా ,తర్వాత ప్రముఖ టి వి చానెల్ లో ముఖ్య ప్రోగ్రామర్ గా పని చేశాడు .అమెరికా లైబ్రరి ఆఫ్ కాంగ్రెస్ కు ఇంగ్లీష్ కవిత్వం లో కన్సల్టంట్ గా వ్యవహరించాడు .అతని’’ మోసెస్ ‘’నవల చాలా ప్రసిద్ధమైంది ..అతని ఉద్గ్రందాలన్ని అనేక ప్రచురణలు పొంది ప్రాచుర్యం పొందాయి .1977 డిసెంబర్ 18న 92 వ ఏట మేయర్ మరణించాడు ..ఆంగ్ల సాహిత్యం లో అంటర్ మేయర్ మేజర్ పాత్ర నే నిర్వహించాడు .లూయిస్ అంటర్ మేయర్ రాసిన ఇప్పటికీ కరదీపికగా ఉన్న ‘’లైవ్స్ ఆఫ్ దిపోఎట్స్ ‘’గ్రంధం ముఖ్య భూమిక గా తీసుకుని , అనేక విషయాలు జోడించి ,అందరూ హాయిగా చదువుకునే వీలుగా ‘’పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు ‘’ను యువతరానికి స్పూర్తి దాయకం గా రాసి పూర్వ ఆంగ్ల కవిత్వాన్ని వారికి చేరువ గా తెచ్చే ప్రయత్నం చేశాను .సాహిత్యాభిమానులందరూ ఆదరిస్తారని భావిస్తాను .ఆంగ్ల కవితా సాగరాన్ని అవలీలగా మధించి అందులోని అనర్ఘ మణులను వెలికి దీసి సాహితీ లోకానికి అంద జేసిన సాహితీ పిపాసి లూయిస్ అంటర్ మేయర్ కు క్రుతజ్ఞతాంజలి ఘటిస్తున్నాను
గబ్బిట దుర్గా ప్రసాద్ -19-7-4-ఉయ్యూరు