పుట్ట పర్తి వారి పుట్ట తేనె చినుకులు -9
కృష్ణ భక్తి ప్రచారం
ఆంద్ర దేశం లో శ్రీ రామ ఉపాసన మిగిలిన రాష్ట్రాలలో కంటే ఎక్కువ .దీనికి కారణం ఆంద్ర దేశం తో రాముడికి ఉన్న సంబంధమే .ఇక్కడి అనేక ప్రాంతాల్లో సంచరించటమే .కేరళ లో కృష్ణ భక్తికే ప్రాదాన్యం .జయదేవుని గీత గోవిం దానికి ,శాక్తేయానికి అది ఉనికి పట్టు .కన్నడం లో ద్వైతులు విఠల భక్తీ ప్రచారం చేశారు .వీర శైవులు శివపరత్వాన్ని వ్యాపింప జేశారు .తమిళం లో రామభక్తులు ఉన్నారుకాని ప్రచారం తక్కువే .ఇక్కడ మురుగన్ ,వినాయక శివ పూజలెక్కువ .ఒరిస్సా లో కృష్ణ భక్తికే ఎక్కువ ప్రాధాన్యం .మహా రాష్ట్ర లో శివాజీ గురువు సమర్ధ రామ దాస స్వామి రామ భక్తీ ప్రచారం కొంత చేశాడు .కాని అక్కడ పాండురంగ విభునికే ప్రచారం ఎక్కువ .ఉత్తర భారతం లో కృష్ణ భక్తీ నరనరానా జీర్ణిం ఛి పోయింది .ఇది వల్లభాచార్యులు తెచ్చిన పెను మార్పు .ఈయన కృష్ణ దేవరాయల సమకాలీనుడు .
హిందీ లో ‘’అష్ట చాప్ ‘’కవులు ప్రసిద్ధులు .వీరంతా వల్లభ ప్రసాదితులే .సూరదాసు వల్లభుని శిష్యుడే .మీరా కూడా శిష్యురాలే .వల్లభ సంప్రదాయం లో మగవారు ఆడ వేషం లో ఉంటారు .అంటే అందరూ గోపికలే .వీరు కృష్ణుని ప్రతినిధులని విశ్వాసం .వీరి పీఠాలు గుజరాతులో ఎక్కువ గా ఉన్నాయి .గురువుల పాద తీర్ధాన్ని పుచ్చుకొంటారు .గురువు నమిలిన తమల పాకు ను గ్రహిస్తారు .అంతరంగ సేవా చేస్తారు .ఏకాదశి రోజు కూడా తాంబూలం వారికి నిషిద్ధం కాదు .వల్లభుడిని ఆ నాటి కాశీ పండితులు ఇవన్నీ చూసి ఆక్షేపించారు .కాని చివరికి కాశీ విశ్వనాధుడే స్వయం గా వల్లభుడు మహా భక్తుడు అని ప్రకటించాడని పుట్టపర్తి వారు తెలియ జేశారు .
వల్లభ పండితుని ‘’అణు భాష్యం ‘’ప్రసిద్ధ రచన .ఆయన అసామాన్య వ్యక్తీ .సామాన్యులు ఆయన్ను అర్ధం చేసుకోలేరు .వల్లభ మతం లోని కొన్నిఆచారాలను ఖండిస్తూ ‘’స్వామి నారాయణ మతం ‘’అనే కృష్ణ భక్తీ మతం ప్రచారం లోకి వచ్చింది .ఇదికాక ‘’మహానుభావ ‘’సంప్రదాయం ఇంకొకటి ఉందని నారాయణా చార్య ఉవాచ .దీని నిర్మాత కృష్ణ భట్టు .వీరు నల్లని వస్త్రాలనే కడతారు సన్యాసులే కాని క్షౌరం చేయిం చు కొంటారు .శ్రీ కృష్ణుడిని ,దత్తాత్రేయుడిని ఉపాసిస్తారు .’’కృష్ణ చరితామృతం ‘’,’’లీలా నిధి ‘’,లీలామృతం ‘’వీరి తత్వ బోధకు సహకరిస్తాయి .’’హరిదాసు మతం ‘’అని వేరొకటి ఉంది .వీళ్ళు బృందావనం లోనే ఉంటారు ‘’రసిక పదం ‘’,సాధారణ సిద్ధాంతం ‘’వీరి ముఖ్య గ్రంధాలు .
వీటికి తోడు ‘’రాదా వల్లభ మతం ‘’అనేది మరొకటి అక్బరు సమకాలికుడైన హరిదాసు దీన్ని ప్రచారం చేశాడు బృందావనం లో రాదా కృష్ణ విగ్రహాలను హరిదాసు ప్రతిస్టించాడు .ఇంద్రియ సుఖాన్ని భక్తితో సమన్వయ పరచటం అనేది వల్లభుడు హరిదాసు చేశారు .భక్తిమాల సేవా దశ ,వేదగానం వీరి గ్రంధాలు బృందావనం లో హరిదాసు సమాధి ఉంది .కృష్ణ భక్తీ ప్రచారకులలో ‘’ నింబార్కర్ ‘’పాత్ర గణనీయమైనది .ఈయన రాసిన భాష్యాలను ఔరంగా జేబు తగల పెట్టించాడు .బీహార్-ఒరిస్సా లకు చెందిన జయదేవుడు గీత గోవిందాన్ని రాసి భక్తిలో తన్మయడయ్యాడు .అయన అష్ట పదులు అందరికి ఇస్టపదులే .సంతుష్ట పదులే .జయదేవుడికి ప్రమాణ గ్రంధం భాగవతం .నిమ్బార్కర్ ప్రచారకులు బృందావనం ,గోకులం లలో ఇప్పటికి ఉన్నారు .వీరు పరమ శాంత స్వాభావులు .భక్తిలో నాయక ,నాయకి భావం ముఖ్యం అని వీరి భావన .రత్నమాల ,రత్న మంజరి మొదలైనవి వీరి సిద్ధాంత గ్రంధాలు .శుక మహర్షి యే’’భాగవత మతం ‘’అనేదాన్ని ప్రచారం చేశాడని సరస్వతీ పుత్రుల అభిభాషణం .శుకుడు రాసిన ‘’సూత్రా భాష్యం ‘’అనే గ్రంధం కూడా ఉందని ఆచార్య ఉవాచ .
మీరా సంప్రదాయం గుజరాతులో ఎక్కువ అంటారు ఆచార్య స్వామి .బెంగాల్ లో చైతన్య మహా ప్రభు కృష్ణ భక్తీ కి గొప్ప ప్రచారకుడు .వీరికి భాగవతం, భగవద్ గీతా ముఖ్య గ్రంధాలు .కృష్ణ భక్తులను ఉత్తర హిందూస్థానం లో ‘’గోస్వాములు ‘’అని గౌరవం గా పిలుస్తారు .రూప గోస్వామి ప్రముఖ ఆలంకారిక రచయిత. కృష్ణ మత ప్రచార మఠాలు బెంగాల్ లో ఎక్కువ .కృష్ణుడు ఎంతటి చిత్రపురుషుడో ఆ భక్తీ కూడా అంతే చిత్రం గా ఉంటుందన్నారు పుట్టపర్తి వారు .దాన్ని అర్ధం చేసుకోవటానికి సామాన్య హృదయం చాలదన్నారుకూడా .
వల్లభా చార్య
చైతన్య ప్రభు రూప గోస్వామి
స్వామి హరిదాసు
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -15-9-14-ఉయ్యూరు
