గీర్వాణ కవుల కవితా గీర్వాణం -44

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -44

44-కవి శిక్ష రాసిన -మొదటి వాగ్భటుడు

జైన  కవి వాగ్భటుడు1121-1156 కాలానికి చెందినా వాడు ,’’వాగ్భటాలంకారం ‘’ రాశాడు .ఇందులో అయిదు పరిచ్చేదాలుంటాయి .కావ్య లక్షణాలు ,హేతువులు ,ప్రయోజనాలు ,కవి శిక్ష ,కవిసమయాలు ,కావ్య భేదాలు ,దోషాలు గుణాలు ,భాష ,అలంకారం ,రీతులు ,చిత్రబంధ కవిత్వం నాయికా నాయక భేదాలు రసం మొదలైన వన్నీ  చర్చించాడు కావ్యాలను మూడు రకాలుగా చెప్పాడు ఛందస్సుతో ఉన్నవి ఛందస్సు లేనివి ,మిశ్రమాలు .రీతులలో గౌడీ .వైదర్భి లనే గ్రహించాడు .లక్షణాలకు ఉదాహరణలు తానె స్వయం గా రాయటం వాగ్భటుని ప్రత్యేకత .’’నేమి నిర్వాణం ‘’అనే మహాకావ్యాన్ని రాశాడు .ఇతని అలంకార గ్రంధానికి సింహ దేవ గని వ్యాఖ్య రాశాడు .ఇనో గమ్మత్తైన విషయం తన అలంకార గ్రంధానికి తానె వ్యాఖ్యానం రాసుకోవటం .

45-ఛందోశాస్త్రం రాసిన-  రెండవ వాగ్భటుడు

పద్నాలుగవ శతాబ్దికి చెందిన మరొక వాగ్భటుడు ఉన్నాడు .ఇతనిని రెండవ వాగ్భటుడు అంటారు .ఈయనా  ఆలంకారికుడే .’’కావ్యాను శాసనం ‘’రాశాడు .ఇది సూత్ర పద్ధతిలో సాగిన రచన .తానె స్వయం గా ‘’అలంకార తిలకం ‘’అనే వ్యాఖ్యానాన్ని రాసుకొన్నాడు .ఇది కాక చందోసాసనం అనే ఛందస్శాస్త్రాన్ని కూడా రాశాడు .ఋషభ దెవక చరిత్ర అనే మహాకవ్యాన్నీ రాశాడు .

అష్టాంగ సంగ్రహ  అష్టాంగా హృదయ అనే ఆయుర్వేద గ్రంధాలను  రాశాడు వాగ్భటుడు .యితడు బౌద్ధుడు .చరక ,శుశ్రుత సంహితలలో వాగ్భాటుని గురించి ఉంది .ఆనాటి సింధు ఈనాటి పాకిస్తాన్ లో ఉండేవాడు .సింహగుప్తుని కుమారుడు .అవలోకితుని శిష్యుడు .ప్రఖ్యాత ఆయుర్వేద శాస్త్ర కర్త ర్త చరకుని శిష్యుడు .మూడు వేల సూత్రాలను రాశాడు .ఎనభై అయిదు శాతం వ్యాధులు ఆయుర్వేద  సూత్రాలను పాటిస్తే డాక్టర్ తో పనిలేకుండా నయమవుతాయని మిగిలిన పది హీను శాతం వాటికే మందులు వాడాల్సి వస్తుందని తెలియ జేశాడు .శుశ్రుతుడు శస్త్ర వైద్యం లో దిట్ట .చరకుడు ఆయుర్వేద మేధావి .వాగ్భాటుడు ఆయుర్వేద సార సంగ్రహం చేసిన వాడు ఈ ముగ్గురిని ఆయుర్వేద త్రయం అంటారు .

అష్టాంగ హృదయ సంహితను వాగ్భాటుడు కమ్మని కవిత్వం లో రాశాడు .ఇందులో ఏడువేల నూట ఇరవై శ్లోకాలున్నాయి .ఎనిమిది విధాల వైద్యం గూర్చి చెప్పాడు .అష్టాంగా హృదయ సంహిత ఆయుర్వేదం లో వచ్చిన మాస్టర్ పీస్ గ్రంధం .ఇది అనేక దేశాలలో ఆయా భాషలలో అనువాదం పొందింది . అష్టాంగ  నిఘంటు ,అష్టాంగ సార ,భావ ప్రకాశ ,ద్వాదసార్ధ నిరూపణ ,కాల జ్ఞాన ,పదార్ధ చంద్రిక ,శాస్త్ర దర్పణ ,శత శ్లోకి ,వాగ్భటీయ ,వామన కల్ప ,మొదలైనవి రాసినట్లు తెలుస్తోంది .

46- రాజ తరంగిణి కర్త –కల్హణుడు

కాశ్మీర రాజుల చరిత్ర ‘’రాజ తరంగిణి ‘’రాసిన కల్హణుడు కాశ్మీర రాజు జయ చంద్రుని ఆస్థానకవి .కాలం 1127-1149.ఏంతో శ్రమించి రాజుల చరిత్రలను సేకరించి అధారితటేటివ్ గా రాజ తరంగిణి రాశాడు .ఇందులో ఎనిమిది తరంగాలున్నాయి .మదటి మూడు తరంగాలలో ఊహలు అపోహలు కలగా పులగం గా ఉంటాయి మిగిలినవి పూర్తీ చారిత్రిక సత్యాలే .తండ్రి అమాత్య చంపకుడు .1148-49మధ్య రాజ తరంగిణి రాశాడు ..తండ్రి కాశ్మీర రాజు హర్షుడి ఆస్థానం లో ద్వారపతి .తర్వాత మంత్రి అయ్యాడు .శైవమతావలంబ కుటుంబం .అయినా బౌద్ధం అంటే అభిమానం .హర్ష రాజు దుర్మార్గుడు .తిరుగుబాటు జరిగి దేశం అల్లా కల్లోలమైంది హర్ష వధ తర్వాత తండ్రి పదవి ఊడింది .కల్హణుడు ఎక్కడా రాజాస్థానం లో ఉన్న దాఖలాలు లేవు .

రాజతరంగణీయం

ఇందులో 7826 శ్లోకాలున్నాయి శాంత రస ప్రధానం గా కల్హణుడు రాశాడు .తానుకొత్తగా చెప్పింది ఏదీ లేదని పూర్వపు వాటినే గుర్తుకు తెస్తున్నానని చెప్పాడు .తనకు ముందున్న పదకొండు రచనలే రాజతరంగిణి కి ఆధారం అన్నాడు .ఇందులో నీలమత పురాణం ,క్షేమేంద్రుని నృపావలి ,హెల రాజు రాసిన పార్దివా వలి మొదలైనవి .ఎన్నో శాసనాలను పత్రాలను పరిశోధించి రాసిన ఉద్గ్రంధం ఇది .మొదటి నుంచి తన కాలం వరకు ఉన్న రాజుల చరిత్రలన్నీ సేకరించి రాశాడు .ఏది చెప్పినా నిష్పాక్ష పాతం గా చెప్పాడు .ఆ నాటి రాజకీయాలను ఉద్యోగులను వారి పాలన లో డొల్ల తానాన్ని బయటికి తీసి నిర్భయం గా చెప్పాడు .రాజకీయ ఆర్ధిక సామాజిక  నైతికక ధార్మిక న్యాయ విషయాలన్నీ చర్చించాడు .యూరపు దేశం లోని మధ్యయుగ చరిత్ర ఉన్నట్లే రాశాడని అభినందించారు .స్టెయిన్ అనే ఆంగ్లేయుడు 1900లో ఇంగ్లీష్ లోకి అనువదించి ప్రచురించాడు .1617లో జహంగీర్ కాలం లో హైదర్ మాలిక్ పర్షియన్ భాషలోకిపా శికం గా  అనువాదం చేశాడు  ఆధునిక  యుగం లో రంజిత సీతా రామ పండితుడు పూర్తిగా అనువాదం చేశాడు  పిరదౌసి రాసిన షానామా కంటే రాజ తరంగిణిలో వాస్తవం పాలు ఎక్కువ .

కల్హణుడు వ్యాకరణ పారంగతుడు .ఇతని గొప్పతనాన్ని’’ మంఖ పండితుడు’’మెచ్చాడు .అర్ధ ,రాజనీతి బౌద్ధ శాస్త్రాలను ఆకళింపు చేసుకొన్నాడు .చక్కని కధనాన్విత శైలి  లో రాశాడు .కధనాలను కావ్య పద్ధతిలో రాశాడు .రసాన్ని ప్రకటించేటప్పుడు నేల విడిచి సాము చేయలేదు .వైదర్భీ రీతిలో నూత్న శబ్ద భాండారం తో రసజ్నులను మెప్పించాడు .కాశ్మీర పదజాలం సంస్కృతం లో ఎక్కువగా చేరింది .

అశోకుడి ముందు యాభై రెండు రాజుల చరిత్ర గురించి వివరించాడు .ఒక్కో రాజు పాలనా కాలం సుమారు యాభై ఏళ్ళుగా గ్రహించాడు .అశోకుడిని వెయ్యేళ్ళు ముందుకు నేట్టాడుకాని మౌర్య వంశస్తుడే అన్నాడు .కుషాన రాజుల చరిత్రనూ సాధికారం గా రాశాడు. మిహిరకులుడు శివాలయం నిర్మించాడని బ్రాహ్మణులకు భూరి దానాలిచ్చాడని కనిష్కుడికాలం లో ఆచార్య నాగార్జుండు ఉన్నాడని ,మాత్రుగుప్త రాజు కళా పోషకుడు ,కవి అని అతని ఆస్థానం లో ‘’మేంఠకవి ‘’ఉండేవాడని ,ఆయన హయగ్రీవ వధ  రాశాడని చెప్పాడు .ఉత్పల వంశ రాజులలో అవంతి వర్మ మొదటి రాజు అని అతనికాలం లోనే కాశ్మీర దేశ చరిత్ర ఐతిహాసిక సత్య సమన్వితం గా రచించాడు .కాశ్మీర రాజు హర్షుడు నాలుగు వేల బుద్ధ దేవాలయాలను విగ్రహాలను ధ్వంసం చేసినట్లు చెప్పుకొన్నాడు .కాశ్మీర రాజుల చరిత్రను సాధికారం గా రాసిన మొదటి కవి కల్హణుడు .

మరో కవితో ఈ సారి

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -18-10-14-ఉయ్యూరు

 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.