ఉయ్యూరు లో ఉగాదికి ఒక రోజు ముందే కూసిన కో యి(ఈ)ల -2

ఉయ్యూరు లో  ఉగాదికి ఒక రోజు ముందే కూసిన కో యి(ఈ)ల -2

30-3-14ఆదివారం సరస భారతి 60వ సమా వేశం గా నిర్వహిస్తున్న శ్రీ జయ ఉగాది వేడుకల నిర్వహణ కు మేమందరం సకుటుంబ సపరి వారం గా మధ్యాహ్నం మూడు గంటలకే రోటరీ ఆడి టోరియానికి కార్లలో చేరాం .వేదిక దివ్య సుందరం గా ఉంది .కుర్చీలు  మైకులు అక్కడి సిబ్బంది సిద్ధం గా ఉంచారు .మేము తీసుకు వెళ్ళిన ఫలాలను  జ్ఞాపికలను  ఆవిష్కరించ బోయే ‘’మహిళా మాణిక్యాలు ‘’పుస్తకాలూ సన్మాన శాలువాలు ,నూతన వస్త్రాలు పూల హారాలను వేదికపై సన్నద్ధం చేశాం . మా గుడి దగ్గర బడ్డీ నడిపే ‘’పెద్దాడు ‘’మాకు సాయం చేశాడు .మా అబ్బాయి శర్మ వీటి నన్నిటినీ పర్య వేక్షించాడు .ఎండ బాగా ఉంది జనం ఝడిసి రారేమో నను కొన్నాము .క్రమం ఆ అందరూ రావటం ప్రారంభించారు ధైర్యం వచ్చింది .ఇంతలో కాంటీన్ వారు స్నాక్స్ రెడీ చేశారు .అప్పుడే  అమెరికా నుండి ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు ఆర్డర్ పై పంపిన కానుకలు ,పుష్ప గుచ్చం అందించాడు ఒకాయన .100_1419 100_1418ఫోటోలు తీసుకొన్నాం వారి కి సంతృప్తి కోసం .అందరిని స్నాక్స్ తీసుకోమని కోరాం . అందరూ వచ్చి తీసుకొన్నారు .DSCN8532 DSCN8534 DSCN8538

అంతకు ముందు రాత్రి బందరు నుండి శ్రీ వి వి ఏం శాస్త్రి గారు ఫోన్ చేసి తమ చిన్నారులు ఏక పాత్రాభినయం చేస్తారని అవకాశం ఇప్పించమని కోరారు .రమ్మని చెప్పి ఆహ్వానించాను 100_1423 100_1422 100_1429 100_1426 100_1420 100_1421.అలాగే కొందరు కవి మిత్రులు ఆహ్వానం లో తమ పెరులేకున్నా రావచ్చా అని ఫోన్ లో అడిగితె రమ్మనమని ఆహ్వానించాను వారూ వచ్చారు .ఉయ్యూరు సాహిత్య సంగీతాభిమానులూ విశేషం గా విచ్చేయగా  ఆడిటోరియం నిండుగా కని  పించింది ,తేనీరు సేవనం అయిన తర్వాత ముందుగా శ్రీ కే.టి వి.ఎల్ యెన్ ఆచార్యులు గారు  రచించి స్వర పరచిన ‘’ఆమని కి స్వాగతం ‘’ గీతం కమనీయం గా గానం చేసి ఆమనికి స్వాగతమ పలికారు .మచిలీ పట్నం నాగార్జున పబ్లిక్ స్కూల్ లో ఏడవ తరగతి చదువుతున్న ఛి వి యెన్ వి ఎస్ పవన్ కుమార్ ‘పల నాటి బాల చంద్రుడు ‘’ఏక పాత్రాభినయం చేసి అందరిని ఆశ్చర్య చకితుల్ని చేశాడు .అతని తమ్ముడు ఒకటవ తరగతి చదువుతున్న ‘ఛి వర ప్రసాద్ ‘’దుర్యోధనుడు ‘’ఏక పాత్రాభినయం తో  సంభ్రమం  కలిగించి సుభాష్ అని పించాడు ఈ సోదరులకు తండ్రి శ్రీ శాస్త్రి గారే ఆహార్యం సమ కూర్చి వేషాలు వేయించి పాత్రోచితం గా నటింప జేశారు .చిన్నారులు పాడిన పద్యాలు వన్స్ మోర్ అని పించాయి .అందరికి మహదానందం కలిగించిన ఈ చిన్నారి బాల నటులకు సరసభారతి తరఫున 500రూపాయలు జ్ఞాపిక బహూకరించాను.

సరస భారతి శ్రీ జయ ఉగాది నివేదిక

సరసభారతి కార్య దర్శి శ్రీమతి మాది రాజు శివ లక్ష్మి అతిధులను వేదిక పై ఆహ్వానించగా పుష్ప గుచ్చాలతో జంట కమలా ఫలాల తో సరసభారతి కార్య వర్గ సభ్యులు ,మా మనవాళ్ళు మనవ రాళ్ళు స్వాగతం పలికారు .కుమారి బిందు దత్తశ్రీ ‘’మా తెలుగు తల్లి కి ‘’ గీతా గానం తో సభ ప్రారంభ మైంది .  సభాధ్యక్షుని గా కార్య క్రమం జరిగే విధానం వివరించాను .శివ లక్ష్మి ‘’సరస భారతి నివేదిక ‘’ను చదివి సంస్థ ఏర్పడిన నాటి నుండీ జరిగిన పురోగతిని వివరించింది .100_1430 100_1434 DSCN8583 DSCN8606 DSC_8036 DSC_8035

మొదట గా    ‘’మహిళా మాణిక్యాలు ‘’పుస్తకాన్నివిజయ వాడ ఆకాశ వాణి కేంద్ర సంచాలకులు శ్రీమతి ముంజు లూరి కృష్ణ కుమారి గారు ఆవిష్కరించి వేదిక పై ఉన్న అతిధులకు అంద జేశారు .తరువాత వక్తలు ఉగాది సందేశాలను అభిప్రాయాలను తెలియ జేశారు .మార్చి ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవం .ఆ నాడు కాక పోయినా ఆ నెల లో మహిళా మాణిక్యాలను ఆవిష్కరించామన్న సంతృప్తి ఉంది .ఈ పుస్తక ముద్రణకు పూర్తీ ఖర్చులు భరించి స్పాన్సర్ గా మాకు వెన్ను దన్నుగా నిలిచిన శ్రీ మైనేని గోపాల కృష్ణ (అమెరికా )గారికి కృతజ్ఞతలు సభా ముఖం గా తెలియ బర్చాను .వారి కోరిక మేరకు వారి సతీమణి ,మహిళా మాణిక్యమూ అయిన   సౌ. శ్రీమతి సత్యవతి గారికి ఈపుస్తకం అంకితమిచ్చిమైనేని వారికి సంతృప్తి ని కలిగించాం .DSCN8588

శ్రీ వల్లీశ్వర్ తన జర్న లిజం అనుభవాలను తెలియ జేశారు .ఇలాంటి కార్య క్రమాలు ఇక్కడ జరగటం సంతోషం అన్నారు .తరువాత శ్రీమతి మున్జులూరి కృష్ణ కుమారి తమ ప్రసంగం లో సరసభారతి అధ్యక్షులు తనకు పరిచయమే నని మంచి చురుకైన కార్య కర్త అని ,అన్ని సభలకూ హాజరై తన వంతు ధర్మాన్ని నేరవేరుస్తారని అన్నారు .శ్రీ పూర్ణచంద్ ‘’నాన్న గారి లో ఉన్న ఉత్సాహం చూసి మా బోటి వాళ్ళం మరింత ఉత్సాహం గా పని చేస్తాం .ఉయ్యూరు అంటే మాకు దుర్గా ప్రసాద్ నాన్న గారే గుర్తుకోస్తారు .తమ యాభై ఏళ్ళ వైవాహిక సంరంభాన్ని సాహితీ ప్రియుల సంగీత ప్రియుల మధ్య జరుపుకోవటం అయన ఆనందానికి కొలమానం ‘’అన్నారు .రోటరీ క్లబ్ అధ్యక్షులు శ్రీ నాగేశ్వర రావు గారు తమ సంస్థ కు కూడా ఈ వేడుకలలో భాగస్వామ్యం కల్పించి  నందుకు అభినందించారు .DSCN8580 DSCN8579

ముందుగా ముఖ్య అతిధి శ్రీ కొమర వోలు శివ ప్రసాద్ గారిని  వారి సతీ మణి శ్రీమతి హైమవతి గారిని సన్మాన ఆసనాల  పైకి ఆహ్వానించాను .వారికి మా దంపతుల వివాహ అర్ధ శతాబ్ది ఉత్సవ ప్రత్యెక ఉగాది పురస్కారాన్ని అందుకోవలసింది గా కోరాము శ్రీ శివ ప్రసాద్ గారి  గురించిన పరిచయాన్ని నేనే రాసి చదివాను .పుష్పహారం,గంధం పన్నీరు ,సెంటు  శాలువా ,నూతన వస్త్రాలతో సత్కరించి వారికి ఇవ్వదలచిన కానుక ను కవర్ లో పెట్టి వారికి అంద జేశాను .మా అల్లుడు శ్రీ కోమలి అవధాని ,మా అమ్మాయి ఛి సౌ .విజయ లక్ష్మి శివ ప్రసాద్ గారికి చేయించిన స్వర్ణ హస్తాభరణం (బ్రేస్  లెట్ )ను మా అమ్మాయిఛి సౌ విజ్జి  మా మనవడు చరణ్ కలిసి ప్రదానం చేసి చేతికి అలంకరించారు .ఇది మాకు తృప్తి. వారి తాహతుకు తగినది కాక పోవచ్చు. కాని మా శక్తికి తగిన కానుక .

శ్రీమతి  హైమవతి గారికి క్కూడా చీర ,జాకెట్ పసుపు కుంకుమ అందించింది మా శ్రీమతి మా కోడళ్ళుతో  అందరూ కలిసి .మా అబ్బాయిలు మనవాళ్ళు మనవ రాళ్ళు అంతావేదిక పైనే ఉండి నిండు దనం తెచ్చారు .శోభ తో వేదిక కళ కళ లాడింది .శివ ప్రసాద్ గారు తమకు జరిగిన ఈ సత్కారానికి మహదానందం గా స్వీకరించి ఈ అను భూతిని మరువ లేమన్నారు ,స్వంత ఇంటికొచ్చిన ఆనందం గా ఉందని సంబర పడ్డారు .నేను చదివిన పరిచయం అద్భుతం అని దాన్ని ఫ్రేం కట్టించి దాచు కొంటామని దంపతులు అన్నారు ‘

తర్వాత స్వర్గీయ గబ్బిట భవానమ్మ మృత్యుంజయ శాస్త్రి గారాల ఉగాది పురస్కారాలను అంద జేశాం .మొదట  శ్రీమతి కృష్ణ కుమారి గారికి సన్మానం చేశాం . వీరి పరిచయాన్ని శివ లక్ష్మి చేసింది .నూతన వస్త్రాలు శాలువా కవర్ తో బాటు సరసభారతి పుస్తకాలు పూలహారం గంధం వగైరా లతో మా శ్రీమతి, కోడళ్ళు సన్మానించారు .శ్రీ వల్లీశ్వర్ గారికి కూడా ఇదే విధానం లో మా అబ్బాయిలు సన్మానించారు శ్రీ వేణు గోపాల రెడ్డి పరిచయాం చేశారు .శ్రీమతి డాక్టర్ శ్రీ విద్య కు కూడా అదే విధానం లో కోడళ్ళు సత్కారం చేశారు .శ్రీమతి కనక దుర్గ పరిచయాన్ని చదివారు .శ్రీ పూర్ణ చంద్ ను అందరం ఆత్మీయం గా సత్కరించి సాహిత్య సరస్వతిని  సన్మా నిన్చామని  సంబర పడ్డాం .పూర్ణ చంద్ ను శ్రీ విజయ సారధి చదివి పరిచయం చేశారు .రోటరీక్లబ్ ప్రెసిడెంట్ శ్రీ నాగేశ్వర రావు గారికీ పై విధం గా సన్మానం చేశాము .దీనితో ఉగాది పురస్కార ప్రదానం పూర్తీ అయింది .DSC_8096 DSCN8581

అటుతర్వాత మా కుటుంబ సభ్యులందరూ మా దంపతులను ఆసనాలలో కూర్చో బెట్టి ఆత్మీయ గౌరవ సత్కారం చేశారు పూల దండలతో ముంచేశారు .శివ ప్రసాద్ దంపతులు మాకు  శాలువా కప్పి గౌరవించారు. శ్రీమతి వారణాసి సూర్య కుమారి గారు మా దంపత్యాం పై పద్యాలు రాసి ఫ్రేం కట్టి బహూకరించారు .అలాగే మిత్రులూ అభినందించారు .

తరువాత ‘’వివాహం –దాంపత్యం ‘’అనే అంశం పై ఉగాది కవి సమ్మేళనాన్ని నిర్వహించాం .దీనిని డా.జి రేజీన ,శ్రీ చలపాక ప్రకాష్ ,శ్రీమతి కే . కనక దుర్గా మహాలక్ష్మి నిర్వహించారు .ముప్ఫై మంది కి పైగా విచ్చేసిన కవి మిత్రులు కమ్మగా చదివి అభినందనలు పొందారు .అయితే సభ ఆలస్యం గా మొదలవటం వలన కార్య క్రమాన్ని కుదించి అందరికి జ్ఞాపికలను అంద జేషి సంతృప్తి పడ్డాం .నిర్వాహకులు ముగ్గురికి శాలువాలు కప్పి జ్ఞాపిక లందించి కృతజ్ఞతలు చెప్పాను .జరిగిన ఈ అసౌకర్యాన్ని సభా ముఖం గా చెప్పి మన్నించమని కోరాను .ఈ కవితలను ఇంటర్ నెట్ లో పెడతామని తెలియ జేశాను .

అసలు కార్యక్రమం  విజిల్ విజార్డ్ ,గళ మురళి శ్రీ కొమర వోలు శివ ప్రసాద్ గారిని వారి సహకార వాద్య బృందాన్ని వేదిక పైకి శివ లక్ష్మి ఆహ్వానించగా మా అబ్బాయిలు ,మన వళ్ళు శాలువాలతో పుష్ప గుచ్చాలు ,ఫల ద్వయం తో స్వాగతించారు .వయోలిన్ పై శ్రీ ఎస్ వి రమణ మూర్తి ,కీ బోర్డు పై శ్రీ లావు కృష్ణ ,మృదంగం పై శ్రీ కాపా శ్రీనివాస రావు ,తబలా పై శ్రీ ఏం ఎస్ పవన కుమార్ ,మొర్సింగ్ పై డా.పి శ్రీనివాస రావు లు సహకరించారు .శ్రీ శివప్రసాద్ తమ ఈల లీలా విలాసాన్ని అందరి అభినందనల మధ్య ప్రారంభించారు .వీరందరికీ జ్ఞాపిక లందిన్చాము

మొదట ప్రార్ధనా గీతం గా హంస ధ్వని రాగం లో ‘’వాతాపి గణపతిం భజే ‘’కీర్తనను అద్భుతం గా గళమురళీ విన్యాసం తో (ఈల పాట సంగీత కచేరి )అలరించి స్వామి ఆశీస్సులన్డుకొని ప్రేక్షకానందం కలిగించారు. అసలు వారి గొంతులో వేణువు ఉందా అన్న అనుమానం కలుగుతుంది వారు ఈల పాట పాడుతుంటే .అంత అలవోక గా సాగింది .చప్పట్ల తో హాలు ప్రతిధ్వనించింది .తరువాత శివ ప్రసాద్ ‘’జగదానంద కారకా ‘’ అనే త్యాగ రాజ కృతిని న భూతో అన్నట్లు పాడి పరవశం కలిగించారు .ఇహలోకపు స్పృహ కోల్పోయి మరో లోకం లో విహరిస్తున్న అను భూతిని కలిగించారు .సహకార వాద్య కారులందరూ సర్వ సమర్దులే .వారి పాండిత్య గరిమకూ గొప్ప అవకాశం ఇచ్చి వారి సమర్ధతను తెలియ జేసేట్లు చేశారు .’’సామజ వర గమన ‘’లో ఎన్ని హొయలు పోకడలు పోయారో చెప్పటం మన వల్ల  కాదు .ఉచ్చ స్థాయి లో పాడినా మందరం గా ఆలాపించినా మధ్య రకం గా ఈల లీల ను ప్రదర్శించినా అంతటా స్పష్టత యే .ఏదీ జారి పోదు. ఏ పదమూ అర్ధం కాకుండా ఉండదు .అన్ని పదాలు అతి స్పష్టం గా గుర్తు పట్టేట్లు పాడగల సమర్ధత శ్రీ శివ ప్రసాద్ గారిది .

ప్రఖ్యాత వైణిక విద్వాంసు లు స్వర్గీయ చిట్టి బాబు ఎప్పుడూ వాయించే ‘’కొమ్మలో కోయిల ‘’గీతాన్ని ఆహ్లాదం గా పాడారు .  కోయిల స్వరాలు పలికించి పులకింప జేశారు .అతి తక్కువ స్తాయి అతి ఉత్కృష్ట స్థాయి లలో సాగే ఈ పాట హృదయాలను తాకి  మనస్సులో దూరి పోయి మైమరపించి మరో లోకం లో విహరింప జేశారు .దీనికి ప్రశంసల వెల్లువే విరిసింది .అన్నమాచార్య కీర్తనలో పదకవితా పితామహుని సంగీత సాహిత్య వాహినిని తన ఈల పాటలో ప్రతిధ్వనింప జేశారు .గాత్రం తో పాడుతున్న అను భూతిని వేణువు పై పలికిస్తున్న భావాన్ని కల్పించి మనల్ని అబ్బుర పరుస్తారు .పరిచారు .

హిందూ స్థానీ గీతం తో తనకు ఆ భాషలో ఉన్న పట్టు ను సత్తాను ప్రదర్శించి చూపారు .భో ’భో శంభో స్వయం భో ‘’గీతాన్ని మహా నైపుణ్యం గా సాహిత్య సంగీత సుస్వర మాలికగా గళవిన్యాసం లో చూపారు .’’అరుణాచల శివ అరుణా చల శివ ‘’ద్వారా సాక్షాత్తు ఆ అరుణాచల అగ్ని లింగ దర్శనమే చేయించారు .ఆ పలుకు బడి అనితర సాధ్యం .నారాయణ తీర్ధుల వారి తరంగాన్ని  అన్ని స్థాయిల్లో వాద్య సహకారం తో సంపూర్ణ సిద్ధి కలిగించారు .ఈల తో వారు పోయిన పోకడలు మాటల తో వివరించ లేనివి .అను భూతి పొందటమే కాని వాచ్యం గా చెప్ప లేనివి .మన మనసులు  కర్ణాలు వారి వశమై పోతాయి .ఆనందం అనుభవించటమే .ఇహ లోక స్పృహ ఉండదు .అదీ ఆ రోజు శ్రోతల పరిస్తితి .’’ఇంత గొప్ప కార్య క్రమం ఉయ్యూరు లో జరిపించి మాకు పరవశం కలిగించిన మీకు, శ్రీ శివ ప్రసాద్ గారికి మేము రుణంతీర్చుకోలేము  ‘’అని సభ అయిన తర్వాత నాతొ అందరూ అన్నారు .ఇది చాలు .అందరి జన్మ ధన్యమయ్యాయని భావించారు .పరవశం తో జనం మై మరచి పోయినట్లు ఆనంద బాష్పాలు రాలుస్తూ స్పందించారు ..’’ఈ అనుభూతి న భూతో న భవిష్యతి ‘’అని పించింది అందరికీ .

ఈల పాట కచేరి మధ్యలో మాజీ ఏమ్  ఎల్ సి,  నా శిష్యుడు ఛి వై  వి బి రాజేంద్ర ప్రసాద్ ఎన్నిక హడావిడి పూర్తీ అయిన తర్వాతా వచ్చాడు అతనితో శివ ప్రసాద్ గారికి పుష్ప హారం సమర్పింప జేషి అభినదనలు తెలియ జేయిన్చాం .రాజేంద్ర ప్రసాద్ మా దంపతులిద్దరికీ శాలువా కప్పి పుష్పహారం వేసి అభినదించాడు .మా అబ్బాయిలతో, మాతో శివ ప్రసాద్ గారి తో ఫోటోలు దిగి సంబరం లో భాగ స్వామి అయ్యాడు మా ఆశీస్సులన్డుకొన్నాడు అతనికి అతనితో వచ్చిన వారికీ జ్ఞాపికలంద జేశాం.DSC_8049-SMILE DSC_8054

కచేరీ పూర్తీ అవగానే నేను ‘’సంగీత సరస్వతి షణ్ముఖ రూపం లో షడ్జమ ధ్వని తో ఈలా నాట్య లీలా విలాసాన్ని ప్రదర్శించింది .వాద్య కారు లందరూ  మహా పండితులు ఎవరూ తీసిపోయే వారుకాదు వారి సంగీత ప్రతిభను గొప్ప గా ప్రదర్శించారు .మంచి సహకారం అందించి కచేరీకి వన్నె తెచ్చారు .వీరు షస్టే సంగీత స్వరూపాలు గా భాసిస్తున్నారు .వీరికి నా ఆశీస్సులు ఈ షణ్ముఖ సరస్వతులకు నమస్కారాలు ‘’అని అభినందించాను .

సరసభారతి సభ్యులందరికీ జ్ఞాపికలందించి వారు చేసిన కృషికి అభినందనలు తెలియ జేశాను .మా టెక్నికల్ ఎడ్వైజర్ శ్రీ వి బి జి రావు గారి సహకారం మరువ లేనిది .కార్య క్రమాన్ని నిర్వ హించిన శ్రీమతి శివ లక్ష్మిని అభినందించాను .రోటరీ నిర్వాహకులు శ్రీ కొండలు గారికి ,ఆహ్వాన పత్రం, బానర్ ,జ్ఞాపిక ల డిజైనర్ శ్రీ ప్రకాష్ ఆరికి శివ ప్రసాద్ ఆరితో శాలువా కప్పించి జ్ఞాపిక లంద జేశాం .వారి తోడ్పాటు కు ఏమిచ్చినా ఋణం తీరదు వారిద్దరూ మంచి సహాయకులు గొప్ప కార్య కర్తలు ఆత్మీయులు .

గబ్బిట వారి కుటుంబం సభా సదు లందరికి విందు భోజనం ఏర్పాటు చేశారు  .అందరూ భోజనాలు పూర్తీ చేసే సరికి రాత్రి పది దాటింది .శివప్రసాద్ బృందానికి వీడుకోలు పలికి వారిని కారు లో విజయ వాడ స్టేషన్ కు పంపి, మేము కార్ల లో ఇంటికి చేరే సరికి రాత్రి పదిన్నర అయింది .ఇలా ఉగాది కోయి(ఈ)ల ఉయ్యూరు లో ఒక రోజు ముందే కూసి విందులు చేసింది ఆనందం పంచింది .

పదనిసలు –స్టేజి మీద ఉన్న వారికీ వేదిక మీద నుంచి మాట్లాడే వారి మాటలేమీ విని పించ లేదు.కాని ఎదుట కూర్చున్న వారికీ మాత్రం మహాద్భుతం గా విని పించాయి .ఈ విషయం నేనూ గమనించాను స్టేషన్ డైరెక్టర్ కృష్ణ కుమారి గారూ గమనించి నాకు చెప్పారు నేను కొండలు గారికి తెలియ జేశాను .ఈకో సిస్టం సరిగ్గా లేకపోవటం,స్పీకర్ల అమరిక సరిగ్గా లేక పోవటం కారణం కావచ్చు .ఇదొక్కటే లోపం మిగిలినది అంతా భేషుగ్గా ఉంది .ఆడిటోరియం ,స్టేజి కుర్చీల అమరిక ,మైకులు  ,సర్వీసు ,కాంటిన్ సేవలూ ఆగున్నాయి .డిన్నర్ మాత్రం అంత సంతృప్తి గా లేదని పించింది

సమాప్తం

మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -3-4-14-ఉయ్యూరు

 

.

మహిళా మాణిక్యాలు నా మాట

మహిళా మాణిక్యాలు పుస్తకం అంకితం పొందిన సౌ శ్రీమతి మైనేని సత్యవతి గారి పరిచయం

 

సరస భారతి శ్రీ జయ ఉగాది పురస్కారాలను అందుకొన్న శ్రీ కొమరవోలు శివ ప్రసాద్

సరస భారతి శ్రీ జయ ఉగాది పురస్కార గ్రీత శ్రీ మతి మున్జులూరి కృష్ణ కుమారి –

సరస భారతి శ్రీ జయ ఉగాది పురస్కారాలను అందుకొన్న డాక్టర్ జి.వి.పూర్ణ చంద్

సరస భారతి శ్రీ జయ ఉగాది పురస్కారాలను అందుకొన్న జర్నలిజం ఘనాపాటి –శ్రీ జి.వల్లీశ్వర్

సరస భారతి శ్రీ జయ ఉగాది పురస్కారాలను అందుకొన్న – డా శ్రీ విద్య

ఘనంగా సరసభారతి ఉయ్యూరు ఉగాది ఉత్సవాలు – వార్త పత్రికలలో

మా 50 వ సంవత్సర వివాహ వేడుకలు

విజిల్ విజార్డ్” శ్రీ కొమరవోలు శివ ప్రసాద్… శ్రీ జయ నామ సంవత్సర ఉగాది వేడుకలు,-

శ్రీ జయ నామ సంవత్సర ఉగాది వేడుకలు

సశేషం

.

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సరసభారతి ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.