మా ఇంట్లో శ్రీ జయ నామ సంవత్సర ఉగాది

మా ఇంట్లో శ్రీ జయ నామ సంవత్సర ఉగాది

మా పిల్లలంతా ఉగాదికి వచ్చి చాలా ఏళ్ళయింది .సరసభారతి ఉగాది వేడుకలు మా వివాహ యాభై వసంతాల వేడుక ,ఉగాది కలిసి రావటం వలన అందరూ కుటుంబాలతో తరలి వచ్చారు .కనుక మంచి సందడి గా ఈ ఉగాది జరిగింది .31-3-14సోమవారం ఉగాది .మా రెండో అబ్బాయి శర్మ మంచి హడావిడి గాడు .పొద్దున్నే నీళ్ళ కాగు వేయటం ,వేడి నీళ్ళు కాయించటం తోకార్యక్త్రమాలు ప్రారంభమైనాయి .మా శ్రీమతి కొడుకులకు కోడళ్ళకు అమ్మాయికి మనవలు మనవ రాళ్ళకు తలంటికి గాను ‘’మాడున చమురు’’ పెట్టింది .ఇది అనాదిగా వస్తున్నా సాంప్రదాయం .వేప పువ్వు కోయటం పెరటిలో మేము పెంచిన చెరకు గడ కొట్టి ముక్కలు చేసి ఆకులను అలంకరించటం ,మామిడి తోరణాలు కట్టటం శర్మ సరదాగా చేశాడు .నేను స్నానం చేసి వంట వాళ్ళ కోసం మది నీళ్ళు పట్టి ఉంచాను .నాసంధ్యావందనం ప్,పూజ పూర్తీ అయేసరికి మా ఆవిడ వేప పువ్వు తో ఉగాది పచ్చడి వెండి గిన్నెలో చేసి రెడీ చేసింది పండ్లూ ,పరవాన్నం తో బాటూ దానినీ నైవేద్యం పెట్టి స్నానాలు చేసిన వారందరికీ వేప పువ్వు ప్రసాదం వెండి చెంచా తో పెట్టాను .కోడళ్ళకు పెట్టాల్సిన కొత్త బట్టలు ,మా ఆవిడ కొడుకులకు అల్లుడికి ఇవ్వాలను కొన్న స్వర్ణం అన్నీ దేవుడి ముందు పెట్టింది .టిఫిన్ లు పూర్తీ చేసి అందరం మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయానికి వెళ్ళాము .100_1724 100_1726 100_1729 100_1723 100_1714 100_1720

దేవాలయం లో స్వామి వారలకు అస్త్త్తర సహస్ర నామార్చన చేశాడు మా పూజారి మురళి .లడ్డూలు పులిహోర ప్రసాదం చేయించాము .స్వామి సన్నిధిలో నాతో మా పూజారి పంచాంగ శ్రవణం చేయించాడు .ఇది ఏటా చేస్తున్న విధానమే .హారతి ,నైవేద్యం అయిన తర్వాతా మంత్రం పుష్పం పూర్తీ చేశాక ప్రసాదం అందరికి పూజారి పెట్టాడు .’’మహిళా మాణిక్యాలు ‘’పుస్తకాలను ఆలయానికి తీసుకొని వచ్చి వచ్చిన వారందరికీ అంద జేశాము .క్రితం రోజు ఉగాది వేడుకలలో దాదాపు రెండు వందల మందికి పుస్తకాలు ఉచితం గా అండ జేశాం . పూజారి మురళి ,బల రామ కృష్ణ  బడ్డి బుడ్డి ,చంద్ర శేఖర రావు రామనాధ బాబులకు ‘’కర్నాటక సంగీత త్రయం ‘’జ్ఞాపికలు అందించాము .తరువాత పిల్లలు వేడుక గా మా అర్ధ శతాబ్ది వివాహ వేడుకలను స్వామి సమక్షం లో నిర్వహించారు .

మా దంపతులిద్దరిని కుర్చీలలో కూర్చో బెట్టి మా అన్నయ్య గారి అబ్బాయి రామనాధ బాబు కోడలు జయ మనుమడు కళ్యాణ్ లు  ముందుగా మా ఇద్దరికీ పుష్ప హారాలు వేసి నాకు  పట్టు బట్టలు ,మా శ్రీమతికి చీరే సారే పెట్టి ఆశీస్సులు పొందారు .తర్వాతా మా అబ్బాయిలు శాస్త్రి శర్మ ,రమణ కోడళ్ళు సమతా ,ఇందిరా ,రాణి మహేశ్వరి  ,మా అమ్మాయి విజయ లక్ష్మి మనుమలు సంకల్ప్ ,భువన్, హర్ష ,శ్రీ చరణ్ ,మనుమ రాళ్ళు హర్షితాన్జని ,రమ్య లు అందరూ కలిసి నూతన వస్త్రాలను మా ఇద్దరికీ పెట్టి పుష్ప మాలలతో ,కవర్ లో నగదు తో సత్కరించి ఆశీస్సు లు అందుకొన్నారు .మాతో దండలు మార్పించారు .మా ఇంట్లో అద్దెకుంటున్న గోపాల కృష్ణ మూర్తి మేష్టారు దంపతులు మా ఇద్దరికీ బట్టలు పెట్టి ఆశీర్వ దించారు .పెద్ద సందడే చేశారు అంతా కలిసి ఇది వాళ్ళు కూడా బలుక్కుని చేసిన పని మాకు అప్పటి దాకా తెలియదు .సర్ప్రైజ్ సందడి అన్నమాట .అంటా అయ్యే సరికి మధ్యాహ్నం పన్నెండు అయింది .వెంటనే ఇంటికి చేరాం .

అప్పటికే ఇంటి దగ్గర వంట వాళ్ళు గోపాల్ దంపతులు వంట పూర్తీ చేసి రెడీ గా ఉన్నారు .ప్రక్క మేస్టారు దంపతులు భవాని గారు మల్లికాంబ గారూ కూడా వచ్చారు అందరికి కోడళ్ళు చక్కగా వడ్డన చేశారు .బొబ్బట్లు లడ్లు ,పులిహోర ,వంకాయ కూర ఆవకాయ సాంబారు మామిడికాయ పప్పు ,టమేటా చట్నీ పెరుగు తో అందరం కమ్మగా భోజనం చేశాం ముందు రోజు ఈ రోజు రెండు రోజులూ గోపాల్ దంపతులు వంట అదిరి పోయేలా చేసి అందరికి సంతృప్తి కలిగించారు .ఇదో ‘’తుత్తి ‘’.అన్నీ సమపాళ్ల లో కుదిరి అందరూ మెచ్చుకొన్నారు .

100_1741 100_1742 100_1743 100_1744 100_1740అందరు క్రితం రోజు శ్రీ శివప్రసాద్ గారు చేసిన  ‘’ఈల పాటసంగీత కచేరీ ‘’గురించే మాట్లాడి ఆనందాన్ని ప్రకటించి అను భూతిని అందరితో పంచుకొన్నారు .ఆ ‘’కోమా’’ లోంచి ఇంకా ఎవరూ బయట పడ లేదు .అదీ శివ ప్రసాద్ గారి ప్రభావం .మనస్సులో చెవుల్లో ఈల పాట గింగిర్లు కొడుతూనే ఉంది అందరికి .ఏ పని చేస్తున్నా ‘’శివ ‘’స్మరణమే ‘’.ఈల’’ ప్రసాదమే ‘’అయి పోయింది .భోజనాల తర్వాత మా పెద్దబ్బాయి శాస్త్రి రెండో వాడు శర్మ కుటుంబాలతో కార్లలో ప్రయాణాలకు సిద్ధమైనారు .మా శ్రీమతి కొడుకులకు  అల్లుడికి ఇవ్వాలను కొన్న ‘’పండుగ కానుక ‘’ను ఇచ్చేసింది .కోడళ్ళకు నూతన వస్త్రాలు ఇచ్చింది .దొడ్లో ఉన్నఅమృత పాళీ అరటి గెల కోసి శర్మ అందరికీ ఇచ్చాడు .ఇంట్లో ఉన్న కూరలు గుమ్మడికాయలు ఎవరికి కావాల్సినవి వాళ్ళను పట్టుకొని వెళ్ళమన్నాం .అలాగే చేశారు .గానుగ లో పట్టించిన కోబ్బరి నూనె ,చేలో పండిన మినుముల పప్పు తీసుకొని వెళ్ళారు .క్రమం గా సందడి తగ్గింది .

మధ్యాహ్నం నన్ను శ్రీ విష్ణ్వాలయం లో ఏటా చేస్తున్నట్లే పంచాంగ శ్రవణం చేయమని ఎండూరి నాగ రాజు కోరితే చేశాను. విష్ణ్వాలయం లో పంచాంగ శ్రవణం ప్రారంభమై 30ఏళ్ళు అయింది . నాగ రాజు తండ్రి సుబ్బారావు ఆ నాటి అర్చకులు వేదాంతం వాసు దేవా చార్ల గారి ప్రోత్సాహం తో ప్రారంభించాడు .సుబ్బారావు చనిపోయినా ,భార్య మరణించినా కొడుకులు నాగరాజు సోదరులు దీన్ని అవిచ్చిన్నం గా కోన సాగిస్తూనే ఉన్నారు .నాగ రాజు అన్న కూడా మరణించాడు .అయినా దీన్ని ఆపకుండా నిర్వహించటం ఎండూరి వారి సంకల్ప బలానికి నిదర్శనం .ఈ ముప్ఫై ఏళ్ళలో దాదాపు ఇరవై ఏళ్ళు నాతోనే పంచాంగ శ్రవణం చేయించారని గుర్తు .నాగ రాజుహైస్కూల్ లో  నా శిష్యుడే కాక ట్యూషన్ కూడా చదివాడు .ఆతను వచ్చి అడిగితె కాదనలేను .నూతన వస్త్రాలతో నాగ రాజు సత్కరించాడు .

సాయంత్రం ఆరు గంటలకు గండి గుంట శ్రీ దత్త గుడిలో పంచాంగ శ్రవణం చేయవలసిందిగా నిర్వాహకులు ఆయుర్వేద మందుల షాపు ఆచార్యుల గారు వారం క్రితమే వచ్చి చెప్పారు.సరేనన్నాను .పావుతక్కువ ఏడు గంటలకు మొదలు పెట్టి ఎనిమిదింటికి పూర్తీ చేసి అందరికి సంతోషం కలిగించా .నా సహాధ్యాయికనక వల్లి వాసి  దత్త భక్తుడు శ్రీ విష్ణు భొట్ల సోమయాజులు తో నాకు నూతన వస్త్రాలు ,కానుక బహూక రింప జేశారు .

మొవ్వలో క్షేత్రయ్య పద పరిషత్ నిర్వాహకు రాలు శ్రీమతి రామ కుమారి గారు ఉయ్యూరు కు సరసభారతి ఉగాది వేడుకలకు వచ్చి ఉగాది నాడు మొవ్వ లో జరిగే కవి సమ్మేళనానికి రమ్మనమని ఆహ్వానిస్తూ నా పేరు కూడా చేర్చిన ఆహ్వాన పత్రిక ను అంద జేశారు .తప్పక రమ్మని కోరారు .దత్త గుడి కార్య క్రమం వలన రాలేనేమో అని చెప్పాను .ప్రతి ఏడాది నన్ను ఆహ్వానిస్తూనే ఉన్నారు .వెళ్లి వస్తున్నాను ఈ సారి కుదర లేదు

ఇలా శ్రీ జయ నామ సంవత్సర ఉగాది మా ఇంట్లోను ,దేవాలయాల్లోనూ ఘనం గా జరిగి అందులో మా వివాహ వేడుక ఒక భాగమై అందరికి సంతోషాన్నిచ్చింది .

మహిళా మాణిక్యాలు పుస్తకాలు 29-3-14ఉదయమే పార్సిల్ లో ఉయ్యూరు మా ఇంటికి చేరాయి .వెంటనే శ్రీ మైనేని గోపాల కృష్ణ గారికి 10కాపీలు ఎయిర్ మెయిల్ రిజిస్టర్డ్ పార్సెల్ లో పంపాను .వారు ఇచ్చినఅడ్రస్ ల ప్రకారం  వారి బంధు, మిత్రులకు ఏప్రిల్ ఒకటవ తేదీ నపంపించాను .సరసభారతికి సన్నిహితులు మిత్రులు ఆప్తులు అందరికి రెండవ తేదీ పోస్ట్ లో పంపాను .నిన్ననే ప్రముఖ కదా రచయిత శ్రీ కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ గారు ఫోన్ చేసి పుస్తకం అందిందని బాగుందని మంచి సమాచారం ఉందని అభినందించారు .నిన్న రాత్రి మా బావ మరది ఆనంద్ వియ్యంకులు శ్రీ మూర్తి గారు తణుకు నుంచి ఫోన్ చేసి అద్భుతం గా పుస్తకం వచ్చిందని అందులో ‘’ఆడదై పుట్టటమే ఆమె నేరమా ?అనేది  చదివి కన్నీరు కార్చానని అనుభూతి తో చెప్పారు .ఇలా దాదాపు మూడు వందలకు పైగా పుస్తకాలను అందరికీ పంపిణీ చేశాను .శ్రీ గోపాల కృష్ణ గారి వితరణ కు మా వంతు సహకారం అందించాము .అంతే .

ఇంతమంది ఉగాది వేడుకలలో పాల్గొని అందం కలిగించినా సరస భారతికి ఆత్మీయులు నాకు ఆప్తులు శ్రీ గుత్తి కొండ సుబ్బారావు గారు సభలో లేని లోటు కొట్ట  వచ్చినట్లు కనిపించింది .సుబ్బారావు, పూర్ణ చంద్ గార్లు లేకుండా సరసభారతి ఏ బృహత్తర కార్యక్రమాన్ని ఇంతవరకూ నిర్వహించలేదు .సుబ్బా రావు గారు అమెరిక నుండే శుభా కాంక్షలు తెలియ బరచి వారి సౌజన్యాన్ని చాటుకున్నారు .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-4-14-ఉయ్యూరు

 

మహిళా మాణిక్యాలు నా మాట

మహిళా మాణిక్యాలు పుస్తకం అంకితం పొందిన సౌ శ్రీమతి మైనేని సత్యవతి గారి పరిచయం

 

సరస భారతి శ్రీ జయ ఉగాది పురస్కారాలను అందుకొన్న శ్రీ కొమరవోలు శివ ప్రసాద్

సరస భారతి శ్రీ జయ ఉగాది పురస్కార గ్రీత శ్రీ మతి మున్జులూరి కృష్ణ కుమారి –

సరస భారతి శ్రీ జయ ఉగాది పురస్కారాలను అందుకొన్న డాక్టర్ జి.వి.పూర్ణ చంద్

సరస భారతి శ్రీ జయ ఉగాది పురస్కారాలను అందుకొన్న జర్నలిజం ఘనాపాటి –శ్రీ జి.వల్లీశ్వర్

సరస భారతి శ్రీ జయ ఉగాది పురస్కారాలను అందుకొన్న – డా శ్రీ విద్య

ఘనంగా సరసభారతి ఉయ్యూరు ఉగాది ఉత్సవాలు – వార్త పత్రికలలో

మా 50 వ సంవత్సర వివాహ వేడుకలు

విజిల్ విజార్డ్” శ్రీ కొమరవోలు శివ ప్రసాద్… శ్రీ జయ నామ సంవత్సర ఉగాది వేడుకలు,-

శ్రీ జయ నామ సంవత్సర ఉగాది వేడుకలు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సరసభారతి ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.