ప్రపంచ సారస్వతం 169-టోకె లావు దేశ సాహిత్యం

  • ప్రపంచ సారస్వతం
  • 169-టోకె లావు దేశ సాహిత్యం
  • దక్షిణ ఫసిఫిక్ లో సుదూర ‘’అటోల్స్’’ అనే ఉంగరంలాగుండ్రగా ఉన్న ముత్యపు దీవుల సమూహమైన హవాయి ,న్యూజిలాండ్ ల మధ్య ఉన్న దేశం .సమోవా నుంచి బోట్ లో  వెళ్ళాలి .24గంటల ట్రిప్.మెరైన్ లైఫ్ బాగాఉన్న’’ నుకు నోను’’ దీని రాజధాని .న్యూజిలాండ్ అధీన దేశం .జనాభా 1,414మాత్రమేకరెన్సీ –న్యూజిలాండ్ డాలర్ .కాన్గ్రిగేషనల్ క్రిస్టియన్ దేశం ఇంగ్లీష్ ,టోకు లావన్ భాషలు .అక్షరాస్యత 90.14 శాతం .చిన్నతనం నుంచి 11వ ఏడువరకు ఒక దశ .12వ ఏడు నుంచి మరో దశ .న్యూజిలాండ్ సబ్సిడీలపై ఆధారం .ఫెనువా ఫలా,ముసిఫెనులువా చూడతగినవి .యాత్రకు సురక్షితం ..
  • టోకె లావు దేశ సాహిత్యం –ఈ దేశం గురించి బైరన్ కవి,ఎడ్వర్డ్స్,క్విరోస్ ,విల్కీస్ రాశారు బర్రోస్ ,విలియమ్స్ లుకూడా ఫకలోవు గురించి రాస్తే ,హేల్,హరాషియోలు ఆంధ్రోపాలజి ఫిలాసఫి రాశారు .జేజే లిస్టర్ ఇక్కడి నేటివ్స్ గురించి , స్మిత్ ,పెర్సి లు ఈ ఐలాండ్ గ్రూపులగూర్చి రాశారు .
  •   అనాదిగా తరతరాలుగావాగ్రూపంలో ఉన్న  సాహిత్యాన్ని సేకరించి ‘’వర్డ్స్ ఫ్రం టోకెలావు ‘’ను పోలినీషియన్ భాషలో తెచ్చారు .ఈభాషను ఈ మూడు ఐలాండ్ లలో 1600మంది ,న్యూజిలాండ్ లో ఉంటున్న 3వేలమంది టోకే లావు ప్రజలు మాట్లాడే భాష .తర్వాత ఈపుస్తకానికి ఆంగ్లానువాదాలు విస్తృతమైన నోట్సు కూడా అచ్చయ్యాయి .ఏఒక్క ప్రక్రియను వదిలిపెట్టకుండా   సేకరించి భద్రపరచిన అపూర్వ గ్రంథం .ఇందులో ఫైలలాజికల్ అనాలిసిస్ అంటే భాషా శాస్త్ర సంబంధ విశ్లేషణ కూడా చేరింది .
  •   టోకెలావు లాంగ్వేజ్ పుస్తకాన్ని ఆంథోని హూపర్ ,జుడిత్ హన్ట్స్ మాన్,కేలిధానోకాలాలో లు కలిసి రాశారు .ఇంతకంటే వివరాలు దొరకలేదు .
  • 170-వాలిస్ అండ్ ఫుటూనా దేశ సాహిత్యం
  • ది టేరిటరి ఆఫ్ వాలిస్ అండ్ ఫుటూనా అనే ఈ ఐలాండ్ దేశం  సౌత్ ఫసిఫిక్ లో తవాలుకు ,ఆగ్నేయ ఫిజికి మధ్యలో ఉంది .రాజధాని-మటౌటు.కరెన్సీ-CFPఫ్రాంక్ .జనాభా -15,289.రోమన్ కేధలిక్ మతస్తులు .అధికార వ్యవహార భాషకూడా ఫ్రెంచ్ .వాలిషియన్ భాషకూడా .అక్షరాస్యత -50శాతం .6-16వయసువారందరికి ఉచిత కంపల్సరి విద్య .ఫిషింగ్ ,సబ్సిడీలే ఆదాయ౦ .ఆర్దికవనరుల కొరత ,సహజవనరులు తగ్గటం ఇంధనంగా కలపవాడకం అరణ్యాలు నశించి బీద దేశమైంది .హార్నే ఐలాండ్స్ ,లేక్ లాలో లాలో ,టాలీటూము చూడతగినవి .కాని యాత్ర అసాధ్యం .
  •  వాలిస్ అండ్ ఫుటూనా సాహిత్యం –ఈ దేశంలో వచ్చిన పుస్తకాలలో –కన్ఫెషన్స్ ఆఫ్ ఎకంప్లీట్లీఇన్సేన్ మదర్-కేరెస్టెన్ కాంప్ బెల్ .దిటుకింగ్డమ్స్-12మంది దేశీయ రచయితలు  రాశారు .యువేయా-క్రిస్టోఫే శాండ్ రాశాడు .హు కంట్రీ కో ఆపరేషన్ స్ట్రాటేజిఫర్ వాలిస్ అండ్ ఫుటూనా-దేశ ప్రభుత్వ ప్రచురణ .ఇంతకంటే వివరాలు దొరకలేదు .
  •  దీనితో ఆస్ట్రేలియా ,ఖండం ,ఓషియానా కాంటినెంట్లోని దేశాలన్నిటి సాహిత్యం రాయటం పూర్త యింది .ఇక అమెరికన్ దేశాల సాహిత్యం రాయాలి .
  •   సశేషం
  • మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-7-20-ఉయ్యూరు
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.