సాహితీ బంధువులకు శుభవార్త

సాహితీ బంధువులకు శుభవార్త

సాహితీ బంధువులకు శుభకామనలు – సుమారు వారం క్రితం తమిళనాడు తిరువన్నామలై నుంచిశ్రీ మైలవరపు రామ మోహనరావు గారు ఫోన్ చేసి ,తానూ ఆంధ్రా ప్రాంతం వాడినేనని ఉద్యోగ విరమణ అయ్యాక తిరువన్నామలై లో స్థిరపడ్డానని తెలుగు భాషా సాహిత్యాలపై ఎక్కువ మక్కువ ఉన్న తాను  ఎన్నో బ్లాగులు చూశానని ,కానీ అన్నిటికంటే సరసభారతి బ్లాగు బాగా నచ్చి క్రమంగా తప్పకుండా చదువుతున్నానని అందులోని విషయాలు చాలా ఆకట్టుకొంటు న్నాయని సంకుచితత్వం లేకుండా  తెలుగు భాషా భారతీయ సంస్కృతుల వేదికగా ఉన్దని రాజకీయ సాంఘిక వైజ్ఞానిక విషయాలతో వైవిధ్యభరితంగా అలరిస్తోందని అన్నారు   ,    మిగిలిన బ్లాగులలో తెలుగు చదవటానికి రుచించటం లేదని సరసభారతి బ్లాగు లోని తెలుగు ఆకర్షణీయంగాఅభిలషణీయంగా ఉందని తాను  ప్రసిద్ధ ఆధ్యాత్మిక వేత్త శ్రీ మైలవరపు శ్రీనివాసరావు గారికి దూరపు బంధువునని చెప్పి తన ఆనందాన్ని నాతో పంచుకొని మురిసిపోయి నాకూ గొప్ప ఉత్సాహాన్ని కలిగించారు . అలాగే అమెరికా,,కెన్యా  సింగపూర్  ఆస్ట్రేలియా ,న్యూజి లాండ్,శ్రీలంక లనుంచి కూడా ఇదివరకు అభిమానులు ఫోన్ చేసి సరసభారతి బ్లాగ్ ను తాము క్రమం తప్పకుండా దువుతున్నామని మనసు విప్పి చెప్పారు ఫోన్ లో .ఇదంతా వారి సౌజన్యం .సరసభారతి అభివృద్ధి సాహితీ బంధువుల హృదయపూర్వక  సహాయ సహకారాలు ఆత్మీయత వల్లనే సాధ్యమౌతోందని  వినయపూర్వకంగా తెలియ జేస్తున్నాను -దుర్గాప్రసాద్ -9-9-19-ఉయ్యూరు

 



గబ్బిట దుర్గా ప్రసాద్
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సరసభారతి ఉయ్యూరు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.