ఆస్తిక మహాశయులకు నమస్కారం.
ప్రతి సంవత్సరము తెలంగాణా ప్రాంతములో జరిగే మన శ్రీ జనార్దనానంద సరస్వతి వేద విద్వన్ మహా సభలు ఈ సంవత్సరము హైదరాబాద్ లో పరమ పవిత్రమగు అష్టలక్ష్మీ దేవాలయము లో వేదవేద్యుడగు అష్టలక్ష్మీ సమేత శ్రీ ఆదినారాయణస్వామి దివ్యసన్నిధి యందు 16-10-2014 నుండి 19-10-2014 వరకు జరుగుచున్నాయి.
కావున ఆస్తిక మహాశయులందరూ ఈ 4 రోజుల సభలలో పాల్గొని ఆ వేదవేద్యుడైన అష్టలక్ష్మీ సమేత శ్రీ ఆదినారాయణస్వామి అనుగ్రహాన్ని, అలాగే వేదమాత అనుగ్రహాన్నికూడా పొందవలసినదిగా ప్రార్ధన.
ఈ వేద సభలు నిరంతరంగా ప్రతిసంవత్సరం నిర్వహించుటకు, తద్ద్వారా సాంప్రదాయిక వేదవిద్యా వ్యాప్తి సంపూర్ణముగా జరుగుటకు వదాన్యులు పూనుకొని ఈ ట్రస్టు శాశ్వత నిధికి తగు సహాయ సహకారాలు అందించవలసినదిగా ప్రార్థిస్తున్నాము.
దీనితో పాటు ఆహ్వాన పత్రికను జత చెయడమైనది.
